E-Paper
Advertisement

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమే.. అది ఆదివాసీల అణచివేతే: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ఆగ్రహం

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమే.. అది ఆదివాసీల అణచివేతే: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ఆగ్రహం
Advertisement

Hidma Encounter: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా (సంతోష్), ఆయన సతీమణి రాజే (రాజక్క)ల మృతిపై సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, వీరిని పథకం ప్రకారం పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారని జనశక్తి కేంద్ర కమిటీ ప్రతినిధి చంద్ర ప్రకాష్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. హిడ్మాను నేటి భారత బిర్సా ముండాగా, ఆదివాసీల హక్కుల పోరాట వారసుడిగా వారు అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు ‘ఎర్ర టెర్రరిజం’ అంతం పేరుతో గత 23 నెలలుగా దేశంలో నరమేధానికి పాల్పడుతున్నాయని లేఖలో మండిపడ్డారు. దేశంలోని అటవీ సంపదను, ఖనిజాలను, నీటి వనరులను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. అడ్డుగా ఉన్న ఆదివాసీలను, విప్లవకారులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేస్తూ, ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీలో కోవర్టులను తయారుచేసి, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

ఎంతోమంది అగ్రనాయకులను కోల్పోయినప్పటికీ విప్లవోద్యమం ఆగిపోదని చంద్ర ప్రకాష్ స్పష్టం చేశారు. ఆర్కే, గాజర్ల రవి, ఇప్పుడు హిడ్మా వంటి నాయకులు అమరులైనప్పటికీ, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతానికి మరణం లేదని తెలిపారు. దోపిడీ, పీడన ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు ఎగిసిపడుతూనే ఉంటాయని, ఇది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని వెల్లడించారు. ప్రజలపై యుద్ధంగా సాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ను ప్రతిఘటించాలని, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలని పిలుపునిచ్చారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×