E-Paper
Advertisement

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమే.. అది ఆదివాసీల అణచివేతే: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ఆగ్రహం

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమే.. అది ఆదివాసీల అణచివేతే: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ఆగ్రహం
Advertisement

Hidma Encounter: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా (సంతోష్), ఆయన సతీమణి రాజే (రాజక్క)ల మృతిపై సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, వీరిని పథకం ప్రకారం పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారని జనశక్తి కేంద్ర కమిటీ ప్రతినిధి చంద్ర ప్రకాష్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. హిడ్మాను నేటి భారత బిర్సా ముండాగా, ఆదివాసీల హక్కుల పోరాట వారసుడిగా వారు అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు ‘ఎర్ర టెర్రరిజం’ అంతం పేరుతో గత 23 నెలలుగా దేశంలో నరమేధానికి పాల్పడుతున్నాయని లేఖలో మండిపడ్డారు. దేశంలోని అటవీ సంపదను, ఖనిజాలను, నీటి వనరులను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. అడ్డుగా ఉన్న ఆదివాసీలను, విప్లవకారులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేస్తూ, ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీలో కోవర్టులను తయారుచేసి, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

ఎంతోమంది అగ్రనాయకులను కోల్పోయినప్పటికీ విప్లవోద్యమం ఆగిపోదని చంద్ర ప్రకాష్ స్పష్టం చేశారు. ఆర్కే, గాజర్ల రవి, ఇప్పుడు హిడ్మా వంటి నాయకులు అమరులైనప్పటికీ, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతానికి మరణం లేదని తెలిపారు. దోపిడీ, పీడన ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు ఎగిసిపడుతూనే ఉంటాయని, ఇది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని వెల్లడించారు. ప్రజలపై యుద్ధంగా సాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ను ప్రతిఘటించాలని, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలని పిలుపునిచ్చారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×