E-Paper
Advertisement

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకోండి

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకోండి
Advertisement

Tirumala News: శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. గోవిందా హరి గోవిందా.. వేంకటరమణ గోవిందా.. అనే భక్తి కీర్తనం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వింటే చాలు భక్తి పారవశ్యంలో పరవశించి పోవాల్సిందే. గోవిందా నామస్మరణ భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. సెలవు దినాలలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు భక్తులు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో.. ప్రత్యేకమైన రోజుల్లో శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తుంది టీటీడీ.

Advertisement

స్వామి వారిని దర్శించుకున్న భక్తులు.. తమ కోరికలు తీరిన వెంటనే మొక్కులు తీర్చుకుంటారు. పలువురు కానుకలు సమర్పిస్తే, మరికొందరు తలనీలాలు సమర్పించే తమ భక్తిని చాటుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల నోట వినిపించే మాట.. గోవిందా నామస్మరణమే. అందుకే తిరువీధులు నిరంతరం గోవింద నామస్మరణతో మారూమ్రోగుతాయి.

Also Read: Vastu Shastra for Idols: ఇంట్లో ఈ 5 విగ్రహాలు ఉంచితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది !

Advertisement

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 నుండి 8 గంటల గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా.. 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.45 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

ఇక,
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ టిన్‌లు సీల్డ్ టెండ‌ర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వ‌ర‌కు సేక‌రించ‌వ‌చ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ వేలం కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబరు 23వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేసే అవకాశం కల్పించినట్లు టీటీడీ ప్రకటించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×