BigTV English
Advertisement

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Duvvada – Madhuri: ఆ జంట ఏది చేసినా, మాట్లాడినా వైరల్ కావాల్సిందే. సోషల్ మీడియాలో వీరికి ఉండే, క్రేజ్ అటువంటిది మరి. అటువంటి జంట దీపావళి రోజు.. ఒకరి చేయి ఒకరు పట్టుకొని దీపాలు వెలిగించారు. టపాసులు కాల్చారు. ఆ జంట ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. దీపావళి రోజు ఆనందంగా దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన ఆ జంట ఏమి చెప్పారంటే?


టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇక పొలిటికల్ లీడర్ గా దువ్వాడకు ఎంత గుర్తింపు ఉందో.. అదే గుర్తింపు సోషల్ మీడియాలో మాధురికి ఉంది. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాద సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. అయితే ఒకరికి ఒకరు తోడుగా మాత్రమే ఉంటున్నామని, తమ మధ్య ఉన్న బంధాన్ని చెడుగా అనుకోవద్దు అంటూ పలుమార్లు మీడియాతో మాధురి అన్నారు.

అయితే దువ్వాడ వివాదం సమయంలో మాధురి అండదండగా ఉన్నారు. దీనితో వీరి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా కోడై కూసింది. ఏదిఏమైనా వీరివురు న్యాయపరమైన చిక్కులు వీడిన అనంతరం ఒక్కటవుతారని అందరూ భావించారు. ఇటీవల దువ్వాడకు సంబంధించిన కుటుంబ వివాదం కొంత సద్దుమణిగిన స్థితిలో.. మాధురి సోషల్ మీడియాలో స్పీడ్ అయ్యారనే చెప్పవచ్చు. ఈమెకు సోషల్ మీడియా పరంగా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతి వీడియో వైరల్ కావాల్సిందే.


తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. అక్కడ మాధురి మాట్లాడుతూ.. కోర్టులో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే.. తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఆ సమయంలోనే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు, అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా మాధురి మాట్లాడినట్లు ఆరోపిస్తూ టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు తాజాగా 41ఏ నోటీసులు జారీ చేశారు.

Also Read: Breaking news: కుశ్నపల్లిలో టెన్షన్.. టెన్షన్.. వెనక్కు తగ్గిన అఘోరి.. చివరకు?

ఇది ఇలా ఉంటే టెక్కలి లోని తమ నివాసంలో ఈ జంట ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. కొత్త ఇంటిని లైటింగ్ తో అందంగా అలంకరించారు వీరు. కొత్త ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటి ఆవరణంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురీలు ప్రమిదలను వెలిగించారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలంటూ లక్ష్మీదేవికి పూజ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్, మాధురి తెలిపారు. అలాగే అందరి జీవితాల్లో కమ్ముకొన్న చీకటి తొలగి, వెలుగులను ఆ దేవదేవుడు ప్రసాదించాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద దీపావళి సంధర్భంగా దువ్వాడ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×