E-Paper
Advertisement

Tirumala Benefits: మీ జీవితాంతం శ్రీవారి దర్శనం పొందాలా? కేవలం ఇలా చేస్తే సరి..

Tirumala Benefits: మీ జీవితాంతం శ్రీవారి దర్శనం పొందాలా? కేవలం ఇలా చేస్తే సరి..
Advertisement

Tirumala Benefits: మీరు శ్రీవారి భక్తులా.. ఏడాదికి ఒకసారి శ్రీవారిని మీ కుటుంబంతో కలిసి నేరుగా దర్శించుకోవాలా? అయితే ఈ వివరాలు మీకోసమే. ఒక్కసారి మీరు ఇలా చేస్తే చాలు, మీ జీవితాంతం ఈ సేవను మీరు పొందవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఈ వివరాలు తెలుసుకోండి. శ్రీవారి దర్శనభాగ్యం పొందండి.

వేలాది భక్తుల రాక..
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఎందరో భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మాడ వీధులు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాదు ఎందరో శ్రీవారి భక్తులు గోవిందా నామస్మరణ సాగిస్తూ, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాన కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అలాగే తమ మొక్కుల తీరిన వెంటనే శ్రీవారి హుండీలో కానుకలు సమర్పిస్తారు.

Advertisement

అధిక విరాళాలు..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా విరాళాలు స్వామి వారికి సమర్పిస్తారు. ఇటీవల భక్తులు ఎందరో కోట్ల రూపాయాలలో విరాళాలు సమార్పిస్తూ, తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా, శ్రీవారి ఆలయానికి విరాళాలు సమర్పించే వారు అధికారిక టీటీడీ వెబ్ సైట్ ద్వారా కానీ, లేక నేరుగా టీటీడీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలి.

విరాళం చెల్లిస్తే సదుపాయాలు ఎన్నెన్నో..
శ్రీవారికి భారీగా విరాళం చెల్లించిన భక్తులకు టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. విరాళం చెల్లించిన నగదును బట్టి వారికి టీటీడీ సౌకర్యాలు కల్పిస్తుంది. ఒక్కసారి స్వామి వారికి భారీ మొత్తంలో విరాళం చెల్లిస్తే చాలు, నేరుగా శ్రీవారిని దర్శించే భాగ్యం కూడా దక్కుతుంది. భక్తులు విరాళాల రూపంలో సమర్పించిన నగదును ఎన్నో సేవా కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఖర్చు చేస్తుంది.

Advertisement

కేవలం రూ. లక్ష చెల్లిస్తే..
శ్రీవారి ఆలయానికి కేవలం లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు టీటీడీ అందించే సదుపాయాలు ఎన్నెన్నో అని చెప్పవచ్చు. ఒకేసారి శ్రీవారి ఆలయానికి లక్ష చెల్లించిన భక్తులకు వారి జీవితాంతం శ్రీవారి సేవలో ఉండే భాగ్యం కలుగుతుంది. విరాళం అందించిన భక్తుడితో పాటు వారి కుటుంబసభ్యులు నలుగురు కలిసి ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా శ్రీవారిని నేరుగా దర్శించవచ్చు. అంతేకాదు స్వామి వారి దర్శనార్థం వచ్చిన సమయంలో కేవలం రూ. 100 లకే గది సౌకర్యం, 6 లడ్లు, ఒక దుప్పట అందజేస్తారు. అంతేకాదు ఐటీ డిటెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Also Read: Longest Train Journey: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

ఎలా చెల్లించాలి?
టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పిలిగ్రాం సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, అక్కడ విరాళం అందించవచ్చు. లేకుంటే నేరుగా టీటీడీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి అధికారిక టీటీడీ అధికారులకు నగదు చెల్లించి రశీదు పొందాలి. అప్పుడు మీకు ఏయే సదుపాయాలను టీటీడీ కల్పిస్తుందో అక్కడ అన్నీ వివరిస్తారు. మరెందుకు ఆలస్యం కేవలం రూ. లక్ష విరాళం అందిస్తే, లైఫ్ లాంగ్ స్వామి వారి దర్శనభాగ్యంను నేరుగా పొందే అవకాశం ఇది. డోంట్ మిస్ దిస్ ఛాన్స్.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×