Big Stories

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu : తెలుగు వారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌరసన్మానంలో ముర్ము పాల్గొన్నారు. వేడుకలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ముర్ముకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. వెంకటేశ్వరి స్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము. కనకదుర్గ ఆశీస్సులు మనందరికీ ఉంటాయన్నారు .

- Advertisement -

కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని గుర్తు చేశారు. దేశభాషలంతూ తెలుగు లెస్స అని రాష్ట్రపతి కొనియాడారు .గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్పవిషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవేదిగా, గొప్ప మహిళగా ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News