Big Stories

Janasena Symbol: కోర్టుకు తెలిపిన ఈసీ, జనసేన గుర్తుపై క్లారిటీ

Janasena Symbol: జనసేన పార్టీ సింబల్ వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అన్ని నియోజకవర్గాలకు గాజు గ్లాసు గుర్తును అధికారులు కేటాయింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. అసలేం జరిగింది?

- Advertisement -

జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు కాకినాడ, మచిలీపట్నంతోపాటు ఆ పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నిర్ణయంతో జనసేన‌కు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన న్యాయస్థానం, విచారణను క్లోజ్ చేసింది. ఈ లెక్కన స్వతంత్రులకు గ్లాసు గుర్తు క్యాన్సిల్ అయినట్టే.

- Advertisement -

తమ పార్టీ పోటీ లేని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవద్దని హైకోర్టును జనసేన మంగళవారం ఆశ్రయించింది. దీనిపై 24 గంటల్లోగా క్లారిటీ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఈసీ నివేదిక అందజేసింది.

ALSO READ:  చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం జగన్

జనసేన పోటీ చేసే సీట్లతోపాటు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఆ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో జనసేన అభ్యర్థులు అయోమయంలో పడడంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఈవీఎంల్లో జనసేన గుర్తు నెంబరు తెలుసుకుని దానిపై సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News