E-Paper
Advertisement

Indore Congress Candidate: అక్షయ్ బామ్ నామినేషన్ విత్ డ్రా వెనుక సంచలన విషయాలు..

Indore Congress Candidate: అక్షయ్ బామ్ నామినేషన్ విత్ డ్రా వెనుక సంచలన విషయాలు..

Reasons Behind Indore Congress Candidate Withdrawal: రెండు రోజులు క్రితం ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ నామినేషన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కానీ ఎందుకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారనే సందిగ్థత చాలా మందిలో ఉంది. అక్షయ్ బామ్ నామినేషన్ విత్ డ్రా వెనుక సంచలన విషయాలు దాగున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇండోర్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని, ఈ వారం ప్రారంభంలో బీజేపీలో చేరడానికి కేవలం ఐదు రోజుల ముందు, 2007లో భూకబ్జా కేసులో హత్యాయత్నం కేసు జోడించారు. ఏప్రిల్ 24న ఇండోర్‌లోని కోర్టు ఆదేశాల మేరకు 17 ఏళ్ల నాటి కేసుకు హత్యాచారాన్ని జోడించినట్లు వార్తా సంస్థలు నివేదికలు పేర్కొన్నాయి.

ఏప్రిల్ 5న, కేసు బాధితుడు, యూనస్ పటేల్, “ఐపీసీలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) జోడించాలని అభ్యర్థిస్తూ ఒక అప్లికేషన్‌తో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు, దీనిని ఏప్రిల్ 24న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంగీకరించారు” , నివేదికలు పేర్కొన్నాయి. దీంతో మాజీ కాంగ్రెస్ అభ్యర్థి, అతని తండ్రి కాంతిలాల్ బామ్‌తో పాటు మరికొందరు వ్యక్తులపై సెక్షన్ 307 జోడించాలని మధ్యప్రదేశ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా మే 10న సెషన్స్ కోర్టు ముందు హాజరు కావాలని అక్షయ్‌కాంతి, కాంతిలాల్ బామ్‌లను కోరింది.

Also Read: నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్

అక్టోబర్ 4, 2007న అక్షయ్ కాంతి భూ వివాదంపై పటేల్‌పై దాడి చేశారని అతనిపూ IPC సెక్షన్లు 294 (అసభ్య పదజాలం, దుర్భాషల వాడకం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదయ్యింది.

మే 13న ఓటింగ్ జరగనున్న ఇండోర్ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ బామ్‌ను పోటీకి దింపింది.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×