BigTV English

Shocking News: బ్రేకింగ్ న్యూస్.. జగన్‌కు భారీ షాక్.. ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో..?

Shocking News: బ్రేకింగ్ న్యూస్.. జగన్‌కు భారీ షాక్.. ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో..?

Shocking News for Jagan: ఏపీలోనూ ఏలూరులో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఎదురైంది. వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు టీడీపీలో చేరారు. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వారు టీడీపీలో చేరారు. వీరితోపాటు పలువురు కీలక నేతలు కూడా టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరికి మంత్రి లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


TDP
TDP

Also Read: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇంకా గుణపాఠం నేర్చుకోవడంలేదన్నారు. పైగా ప్రజా ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక దుష్ర్పచారం చేస్తూ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తమ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తదంటూ మంత్రి స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహ హస్తం అందిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే బడేటి అన్నారు. ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని టీడీపీలో చేర్చుకుంటామంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే కార్పొరేటర్లుగా కూడా దశలవారీగా టీడీపీలో చేరుతారన్నారు.


Also Read: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

అనంతరం ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా గతంలో తాము టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే, ఆ పార్టీలోకి వెళ్లాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది కార్పొరేటర్లు టీడీపీ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ మేయర్ చెప్పారు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×