E-Paper
Advertisement

Pastor praveen death case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. అరెస్ట్ లు మొదలు

Pastor praveen death case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. అరెస్ట్ లు మొదలు
Advertisement

పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజీలతో దాదాపుగా ఈ మిస్టరీ ఓ కొలిక్కి వచ్చినట్టు స్పష్టమవుతోంది. హత్య అని మొదట్లో కాస్త బలంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరే సీసీ టీవీ ఫుటేజీ చూసి దాన్ని అనాలసిస్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ మరణానికి కేవలం ప్రమాదమే కారణమా, ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంలో చాలామంది సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ తప్పుడు ప్రచారాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. అలాంటి ప్రచారం చేసిన ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు.

నాగమల్లేష్ కి రిమాండ్

Advertisement

రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంతానికి చెందిన దేవబత్తుల నాగమల్లేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు నాగమల్లేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనేది ఆయనపై అభియోగం. కోర్టు రిమాండ్ విధించడంతో మల్లేష్ ని రాజమండ్రి జైలుకు తరలించారు.

సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణ

Advertisement

ఈనెల 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బెజవాడ మీదుగా రాజమండ్రి వెళ్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట్లో అది కేవలం యాక్సిడెంట్ అని అనుకున్నారంతా. అయితే కొందరు అది ప్రమాదం కాదని, ఆయన్ని ఎవరో హత్యచేసి రోడ్డు పక్కన పడేశారంటూ ఆరోపించారు. రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల ఆరోపణలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఎక్కడా తొందరపడలేదు, అది ప్రమాదమా, లేక హత్యా అని నిర్థారించేందుకు వారు టైమ్ తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు.

కేసులో పోలీసుల పురోగతి

ఈ క్రమంలో దాదాపు 200 సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషించారు. మొదట్లో కేవలం టోల్ గేట్ వద్ద బైక్ వీడియో విడుదలైంది. ఆ తర్వాత ఆయన వివిధ చోట్ల ఆగిన వీడియోలు, ఆయన్ను పలువురు పరామర్శించినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రవీణ్ పగడాలను నేరుగా కలసిన వారు కూడా మీడియాతో మాట్లాడారు. దీంతో ఈ కేసులో కొంత క్లారిటీ వచ్చింది. ఈ నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ పగడాల, గుంటుపల్లి నుంచి భవానీపురం మార్గంలో ఒకసారి బైక్ పై నుంచి పడిపోయినట్టు తెలుస్తోంది. అక్కడే ఆయన బుల్లెట్ బైక్ హెడ్ లైట్ పగిలిపోయింది. ఆ తర్వాత అదే బైక్ పై ఆయన ప్రయాణం కొనసాగించారు. పెట్రోల్ బంక్ సీసీ టీవీ ఫుటేీలు, గ్రీనరీ పార్క్ లో ఉన్న ఫొటోలు, టీస్టాల్ వ్యక్తి చెప్పిన మాటలు ఆధారంగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాదాపుగా ఇది యాక్సిడెంట్ మాత్రమే అని నిర్థారణకు వస్తున్నారు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం

ఓవైపు కేసు విచారణ జరుగుతుండగా, మరోవైపు పాస్టర్ ది ఖాయంగా హత్యేనంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలు వేరు, అది హత్యేనంటూ ప్రచారం వేరు. కొంతమంది అది హత్యేనని, సోషల్ మీడియాలో రెండు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇలాంటి పోస్టింగ్ ల పై కూడా దృష్టిపెట్టారు. పాస్టర్ మరణాన్ని అడ్డు పెట్టుకుని, మద విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఇప్పటికే ఓసారి పోలీసులు హెచ్చరించారు. అయినా కూడా అలాంటి పోస్టింగ్ లు పెడుతుండే సరికి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా పాస్టర్ వ్యవహారంలో రాజమండ్రికి చెందిన నాగమల్లేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

Big Stories

Advertisement
×