E-Paper
Advertisement

Vijayawada : యువతిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన యువకుడు.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు..

Vijayawada : యువతిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన యువకుడు.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు..
Advertisement

Vijayawada : వాళ్లు ఒకే వీధిలో ఉంటారు. ఆ యువతి కాలేజీకి వెళ్తోంది. ఆమె తాత మనవరాలిని బస్సు ఎక్కించేందుకు తోడుగా వెళ్తున్నాడు. అంతలోనే అటుగా అభి అనే యువకుడు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతనితో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. వాడి జాగింగ్ ఏదో వాడు చేసుకోకుండా.. ఆ యువతిని టీజ్ చేసే ప్రయత్నం చేశారు. పెట్ డాగ్‌ను ఆ అమ్మాయిపైకి ఉసిగొల్పాడు. అది చూసి ఆమెతో ఉన్న తాత రామరావు మందలించాడు. ఇదేం పనంటూ అభితో గొడవ పెట్టుకున్నాడు. ఆ యువకుడు సైతం మాటకు మాట అంటూ వాగ్వాదానికి దిగాడు. కట్ చేస్తే…

విజయవాడలో స్ట్రీట్ ఫైట్

Advertisement

కాసేపటికే ఆ వీధిలో చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఇటు యువతి కుటుంబ సభ్యులు.. అటు యువకుడి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రోడ్డు మీదకు వచ్చారు. తమ అమ్మాయిని ఏడిపిస్తున్నారంటూ ఆమె తరపు వాళ్లు ప్రశ్నించారు. మా వాడిని అన్యాయంగా తిడుతున్నారంటూ అతడికి సపోర్ట్‌గా నిలిచింది ఆ ఫ్యామిలీ. మేటర్ ముదిరింది. ఇరువర్గాలు తిట్టుకున్నారు. సడెన్‌గా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నా పెద్దా.. ఆడా మగా.. అంతా తలో చేయి వేశారు. దొరికిన వారు దొరికినట్టు కుమ్మేసుకున్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కానంతగా రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని లాగేశారు. బట్టలు చింపేశారు. పిడిగుద్దులు గుద్దేశారు. కాలితో తన్నుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది వరకు వీధిలో పడి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అదంతా సమీపంలోని సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫైటింగ్ ముసిశాక.. ఇరు వర్గాలు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. తన కుమార్తెను అభి ఏడిపిస్తున్నాడంటూ యువతి తండ్రి శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చారు. తనను అనవసరంగా కొట్టారంటూ అభి సైతం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువర్గాలకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశాయి.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×