OTT Movie : సస్పెన్స్, మోసాలు, క్రైమ్ ట్విస్ట్లతో సాగే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ కథ ఒక జైపూర్ టూర్ గైడ్, NRI మహిళతో ప్రేమలో పడతాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి మిస్సింగ్ అవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. దిమ్మ తిరిగే క్లైమాక్స్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మర్డర్ బాద్’ (Murderbaad) 2025లో వచ్చిన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అర్నబ్ చటర్జీ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో నకుల్ రోషన్, కనికా కపూర్, షరీబ్ హాష్మి, మనీష్ చౌధరి, సలోని బత్రా, రవినా శర్మ, అమోల్ గుప్తే, ఆంజన్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదల అయింది. 2025 అక్టోబర్ 9న Jio Hotstar లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
జయేష్ అనే వ్యక్తి జైపూర్ లో టూర్ గైడ్ గా జీవిస్తుంటాడు. జయేష్ చాలా చురుకైన వ్యక్తి. టూరిస్టులకు జైపూర్ గురించి చెబుతూ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు కనికా కపూర్ అనే NRI మహిళ జైపూర్ వస్తుంది. కనికా చాలా అందంగా ఉంటుంది. మొదటి పరిచేయంలోనే వీళ్లిద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. ఇక జయేష్, కనికా మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. వాళ్లు జైపూర్ ప్యాలెస్లు, రోడ్లలో తిరుగుతూ సంతోషంగా గడుపుతారు. కానీ ఈ టూర్ లో ఒక అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. జయేష్, కనికా కలిసి ఆమె గురించి వెతుకుతారు. ఎందుకంటే మిస్సింగ్ అయిన అమ్మాయి జయేష్, కనికా లకు పరిచయస్తురాలు.
Read Also : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?
ఈ మిస్సింగ్ లో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. ఈ కేసు జైపూర్ ప్యాలెస్లో జరిగిన ఒక పెద్ద క్రైమ్తో ముడిపడి ఉందని తెలుస్తుంది. జయేష్, కనికా ఈ కేసు వల్ల డేంజర్లో పడతారు. జయేష్ తన తెలివితో, ధైర్యంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి అతను అమ్మాయి మిస్సింగ్ వెనుక అసలు సీక్రెట్ ని కనిపెడతాడా ? ఈ మిస్సింగ్ వెనుక కారణం ఏమిటి ? జైపూర్ ప్యాలెస్ కి, ఈ మిస్సింగ్ కేసుకు సంబంధం ఏమిటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.