E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లక్షల విలువ చేసే ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది. రాజా-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయల్ ఫ్యాక్టరీ ఉంది.

ఆదివారం రాత్రి పది గంటల సమయంలో అందులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధాన్యం నుంచి తవుడును ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది తేరుకునే లోపు ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది.

కార్మాగారంలో సుమారు కోటి రూపాయల విలువైన పవువుల దాణా ఉంది. అందులో సగానికి పైగానే మంటల్లో కాలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు ఈదురుగాలులు తోడు కావడంతో మరింత ఎగిసిపడ్డాయి.

ALSO READ: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!

ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ అధికారులు. దాదాపు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అర్థరాత్రి వరకు మంటలు కొనసాగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దాణా నిల్వతోపాటు ఖాళీగా గోనె సంచలు ఉండడంతో నిప్పు రప్పులు రగిలి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

 

 

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×