E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం
Advertisement

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లక్షల విలువ చేసే ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది. రాజా-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయల్ ఫ్యాక్టరీ ఉంది.

ఆదివారం రాత్రి పది గంటల సమయంలో అందులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధాన్యం నుంచి తవుడును ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది తేరుకునే లోపు ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది.

Advertisement

కార్మాగారంలో సుమారు కోటి రూపాయల విలువైన పవువుల దాణా ఉంది. అందులో సగానికి పైగానే మంటల్లో కాలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు ఈదురుగాలులు తోడు కావడంతో మరింత ఎగిసిపడ్డాయి.

ALSO READ: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!

Advertisement

ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ అధికారులు. దాదాపు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అర్థరాత్రి వరకు మంటలు కొనసాగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దాణా నిల్వతోపాటు ఖాళీగా గోనె సంచలు ఉండడంతో నిప్పు రప్పులు రగిలి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

 

 

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×