E-Paper
Advertisement

Tadepalli Palace: జగన్ ఇంటి సమీపంలో అగ్నిజ్వాలలు.. ఇది ఎవరి పని?

Tadepalli Palace: జగన్ ఇంటి సమీపంలో అగ్నిజ్వాలలు.. ఇది ఎవరి పని?
Advertisement

Tadepalli Palace: ఏపీలో ఏం జరుగుతోంది? తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం మానవ తప్పిదమా? ఎవరైనా కావాలని చేశారా? మాజీ సీఎంకు భద్రత లోపం కనిపిస్తుందా? సిబ్బంది లేకుంటే పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ అభిమానులను వెంటాడుతున్నాయి.

తాడేపల్లి జగన్ ప్యాలెస్ గురించి చెప్పనక్కర్లేదు. ప్యాలెస్‌కు సమీపంలో ఏది జరిగినా పెద్ద న్యూస్ అవుతుంది. వైసీపీ అధికారంలోకి రాగానే వందల కోట్లు ఖర్చు చేసి దుర్భేద్యమైన కోటగా దాన్ని తీర్చిదిద్దారు. ఈ మధ్యనే ఈశాన్యం బరువు ఎక్కువగా ఉందని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యేకంగా ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారు మాజీ సీఎం. వారంతా ప్యాలెస్ చుట్టూ కాపలా కాస్తున్నారు.

Advertisement

అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు చాలానే మార్పులు చేశారు జగన్. బెంగుళూరు నుంచి జ్యోతిష్యులను రప్పించారు. ఈశాన్యంలో బరువు ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పవని సలహా ఇచ్చారు. దీంతో కొంత పార్టు ఇనుప కంచె తొలగించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ప్యాలెస్ చుట్టూ ఎత్తుగా ఇనుప కంచె నిర్మిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటవాళ్లు లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఇక అసలు విషయానికొద్దాం.. గడిచిన నాలుగు రోజులుగా ఏపీలో ఎండలు భగభగమంటున్నాయి. రాత్రివేళ కాస్త చల్లగా ఉన్నా, పగటి వేళ ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం రెండుసార్లు జగన్ ప్యాలెస్ చుట్టూ మంటలు చెలరేగాయి. దీంతో అలర్టయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

ఇంటి బయట రోడ్డు పక్కనున్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఎండకు గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

ALSO READ: సనాతన బోర్డు ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ సిద్ధం

ఒకేరోజు రెండుసార్లు అగ్ని కీలలు ఎగిసిపడడంతో తాడేపల్లిలో ఏం జరుగుతోందన్న చర్చ ఇంటాబయటా మొదలైంది. గురువారం కార్పొరేటర్లలో సమీక్షా సమావేశం నిర్వహించారు అధినేత జగన్. సమావేశంలో వారికి చెప్పాల్సిన మూడు ముక్కలు చెప్పారు. సమావేశం తర్వాత తాడేపల్లి నుంచి జగన్ బెంగుళూరుకు వెళ్లినట్టు సమాచారం.

ఇక అగ్ని ప్రమాదం గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా మాట్లాడు కుంటున్నారు. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. చేసిన పాపాలు ఊరికే పోవదని కొందరంటున్నారు. కావాలనే చేశారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ప్రభుత్వం మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అగ్నికీలల వెనుక ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందా? సమ్మర్ సీజన్‌లో ఇలాంటి సహజమేనని లైట్‌గా తీసుకుంటుందా? అనేది చూడాలి.

 

Related News

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

Big Stories

Advertisement
×