BigTV English
Advertisement

AvinashReddy: అవినాష్‌రెడ్డిని సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవే!? మరి, ఆయన ఏం చెప్పారంటే..

AvinashReddy: అవినాష్‌రెడ్డిని సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవే!? మరి, ఆయన ఏం చెప్పారంటే..
avinash-reddy-cbi

AvinashReddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని 8 గంటల పాలు ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డి విచారణను అధికారులు వీడియోలో రికార్డు చేశారు. అంతేకాకుండా ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో 40 కోట్లు డీల్ ఉందని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ డీల్ గురించే అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మరో వైపు సునీల్ యాదవ్‌కు కోటి రూపాయాలు ఎవరు బదిలీ చేశారనే విషయమై కూడా సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీంతో ఈ ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.


విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాశ్‌ను ప్రశ్నించారు. వివేకా హత్యకు మూడు గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో అరెస్టయిన వారందరూ అవినాశ్‌తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీశారు.

అంతకుముందు వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను వేర్వేరుగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని కలిపి సుమారు గంటన్నరపాటు ప్రశ్నించారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు నిందితులకు వైఎస్ అవినాశ్‌ రెడ్డిలకు ఉన్న సంబంధాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. గూగుల్ టేకవుట్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు ముగ్గురిని ప్రశ్నించారని తెలుస్తోంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి ఎందుకు వచ్చారనే విషయమై సీబీఐ అధికారులు ఆరా తీశారు.


ఇటు వైఎస్‌ వివేకా హత్యకేసుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోధర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసిన జైలు శిక్ష తప్పదని వివేకా హత్య కేసులో కూడా అదే జరుగుతుందని.. జగన్‌ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిపని అవి చేసుకుంటూ వెళ్తాయని, అధారాలున్నాయి కాబట్టే నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు.

మొత్తానికి కోర్టు ఈనెల 25 వరకు అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించిన తర్వాత.. తొలిరోజు విచారణ ముగిసింది. ఐతే.. 25వ తేదీ వరకు రోజూ విచారణకు హాజరుకానున్నారు అవినాశ్‌రెడ్డి. దీంట్లో భాగంగానే మళ్లీ గురువారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు రావాలని అవినాశ్‌ రెడ్డిని ఆదేశించారు సీబీఐ అధికారులు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×