E-Paper
Advertisement

Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Ganja seized: ఏలూరు జిల్లా జిలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనీఖీలు నిర్వహిస్తుండగా రాజమండ్రి నుండి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ‌ని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్‌కు తరలించారు.

Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Ganja seized: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి నుంచి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ‌ని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్‌కు తరలించారు.

రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు గూడ్స్ లారీలో గంజాయి లోడ్ చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో 11 గన్ని బ్యాగుల్లో ఉంచి 220 కేజీల గంజాయిని తరలిస్తున్నారని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.22 లక్షలు రూపాయలు ఉంటుందన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఏలూరు జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వెల్లడించారు .

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×