E-Paper
Advertisement

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ
Advertisement

TTD clarity on adulterated ghee in Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తెలిసీ తెలియక దోషాలు జరిగాయన్నారు. ఈ దోషాలను తొలగించేందుకు శాంతి హోమం, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఆలయంలోని అన్ని విభాగాల్లో శాంతి హోమం చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి మహానైవేద్యం పూర్తి చేశామని చెప్పారు.

ఇక నుంచి లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ పేర్కొంది. మార్చిన నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తున్నామని వెల్లడించింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ పూర్తి చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే, ప్రసాదం కల్తీ జరిగి ఉంటుందని చాలామంది భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే పవిత్రోత్సవాలకు ముందే నెయ్యిని మార్చినట్లు చెప్పారు. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని టీటీడీ అధికారులు భక్తులకు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతోనే లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని వెల్లడించారు. కానీ ఇంకా భక్తుల్లో ఆందోళన నెలకొందని, దీనిని తొలగించేందుకు శాంతి హోమం పూర్తి చేసినట్లు తెలిపారు.

Also Read: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

Advertisement

ఇదిలా ఉండగా, లడ్డూ తయారీ కోసమే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. స్వచ్చమైన నెయ్యి అవునా? కాదా? అనే విషయం తెలుసుకునేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×