E-Paper
Advertisement

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు
Advertisement

Train accident : రాజమండ్రి స్టేషన్ సమీపంలో బాలాజీపేట వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు

9 సర్వీసులు రద్దు..
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో రెండు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

రద్దైన రైళ్ల వివరాలు..
విజయవాడ- విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. విజయవాడ- లింగంపల్లి రైలు ఆలస్యంగా నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు
గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు రద్దు
గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×