E-Paper
Advertisement

Guntur Crime News: ఇన్సూరెన్స్ హెడ్ పై కత్తితో దాడి చేసిన కస్టమర్.. కారణం అదేనా?

Guntur Crime News: ఇన్సూరెన్స్ హెడ్ పై కత్తితో దాడి చేసిన కస్టమర్.. కారణం అదేనా?
Advertisement

Guntur Crime News: ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం వెళ్ళిన ఓ కస్టమర్ ఏకంగా అక్కడి అధికారిపై దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆ అధికారికి తీవ్రగాయాలు కాగా, వెంటనే వైద్యశాలకు తరలించారు పోలీసులు. గుంటూరులోని అరండల్ పేటలో మంగళవారం ఈ ఘటన జరగగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులోని అరండల్ పేటలో గల కేర్ ఇన్సూరెన్స్ కార్యాలయానికి వచ్చిన ఓ కస్టమర్, ఇన్సూరెన్స్ రెన్యువల్ విషయంలో ఆపరేషన్ హెడ్ ను సంప్రదించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని నియంత్రించుకోలేక పోయిన కస్టమర్ కత్తితో ఆపరేషన్ హెడ్ పై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన హెడ్ ను చూసి భయాందోళనకు గురైన సిబ్బంది, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు

Advertisement

Also Read: Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కస్టమర్ ముందుగానే దాడికి పాల్పడాలన్న ఆలోచనతో కత్తి తెచ్చుకున్నారా.. లేక కార్యాలయంలో అందుబాటులో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. దాడికి పాల్పడే స్థాయిలో వీరి మధ్య వాదన ఏ విషయంపై సాగిందో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×