E-Paper
Advertisement

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..
Advertisement
Harsha Kumar Comments on CM Jagan

Harsha Kumar Comments on CM Jagan : వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూలేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి సీఎం జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించిందన్నారు.

జగన్‌కు వంద శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసం చేశారని మాజీ ఎంపీ పేర్కొన్నారు. సీఎం విధానాలతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ నిర్వహిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. దళితులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనాలని ఆయన కోరారు.

Related News

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

Big Stories

Advertisement
×