E-Paper
Advertisement

Gajuwaka News: దారుణం.. యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు.. చివరకు..?

Gajuwaka News: దారుణం.. యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు.. చివరకు..?
Advertisement

Gajuwaka News: గాజువాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. యువతి బంధువులు, చుట్టుపక్కల స్థానికులు యువకుడి గదిలో బంధించి దారుణంగా చితకబాదారు. యువకుడి మొబైల్‌ను తీసుకుని యువతికి సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేశారు. యువతి బంధువులు నిందితుడి తండ్రికి సమాచారం ఇస్తామని చెప్పి గదిలో బంధించారు. యువకుడు అవమానంతో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ రావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో గత కొన్ని రోజుల నుంచి ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇంకా అతని వివాహం కాలేదని.. గాజు వాక శ్రీనగర్ కాలనీలో రెంట్ కు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఇంటి ఓనర్ మనవరాలు ఊరు నుంచి వచ్చింది. ఫస్ట ఫ్లోర్‌ లో ఓనర్ బాత్రూమ్ కొంత ఓపెన్‌గా ఉంటుంది. అయితే నిన్న ఓనర్ మనవరాలు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. దీంతో యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. భాస్కర్ రావు అక్కడ నుంచి తన గదిలోకి వెళ్లాడు. యువతి బంధువులు, స్థానికులు, యువతి లవర్ అక్కడకు చేరుకుని భాస్కర్ రావును చితకబాదారు. అనంతరం రూంలోని యువకుడి బంధించారు. యువతి వీడియో తీశాడని.. భాస్కర్ రావు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీందో ఆందోళనకు గురైన భాస్కర్ రావు రూమ్ లోనే కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

 Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రూ.25,00,000 జీతం భయ్యా.. డోంట్ మిస్..

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయనగరంలో ఆటో నడుతూ జీవనం కొనసాగిస్తున్న భాస్కర్ రావు తండ్రి తాతారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి చంపేశారని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×