E-Paper
Advertisement

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్
Advertisement

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో నాలుగు రోజుల పాటూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ద‌క్షిణ బంగాళాఖాతంలో చెన్నైకి 50 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం ఏర్ప‌డింది. ఈ వాయుగుండం తీవ్ర‌వాయుగుండంగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నావేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీలంక‌, త‌మిళ‌నాడు తీరానికి ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కోస్తాంధ్ర‌లోని ద‌క్షిణ కోస్తా ప్రాంతంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. రేప‌టి నుండి భారీ నుండి తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

Also read: 19 మందిని హత్యాచారం చేశాడు.. ఇతని టార్గెట్ వారే.. సీరియల్ కిల్లర్ అరెస్ట్.. రియల్ క్రైమ్ స్టోరీ!

Advertisement

ముఖ్యంగా నెల్లూరు, తిరుప‌తిలో 26వ తేదీ నుండి ఒక‌టి రెండు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. 27, 28వ తేదీల్లో నెల్లూరు, ప్ర‌కాశం, తిరుప‌తిలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 29వ తేదీన నెల్లూరు, ప్ర‌కాశం, చిత్తూరుతో పాటూ ఉత్త‌ర కోస్తా ఆంధ్ర‌లోని శ్రీకాకులం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక‌టి రెండు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో గాలులు తీవ్ర‌త‌రం అవుతున్నందున‌ మ‌త్స్య‌కారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

55 కిలోమీట‌ర్ల వ‌ర‌కు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. 26వ తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు భారీ గాలులు వీచే అవ‌కాశం ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు అస‌లు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. రైతులు కూడా పంట‌ల‌ను ర‌క్షించుకునేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ‌శాఖ సూచించింది. ఈ నెల 29 ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే వాయుగుండం కార‌ణంగా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న కూడా ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×