E-Paper
Advertisement

AP Weather News : హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం

AP Weather News : హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం
Advertisement

Rains in Andhra Pradesh : మండుటెండల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణంలో అనూహ్యంగా మార్పులొచ్చాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని చల్లనిగాలులు వీస్తున్నాయి. దీంతో.. మాడుపగిలే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు.. కాస్త ఉపశమనం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పాడేరు, అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురిసింది.

తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా.. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడినట్లు చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతటా మేఘాలు విస్తరించి ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Advertisement

Also Read : ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు

అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రం.. వేడిగాలులు, ఎండలు తప్పవని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏదేమైనా.. ఇన్నిరోజులకు రాష్ట్రంలో వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేదతీరుతున్నారు. తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి.

Advertisement

 

 

Related News

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

Big Stories

Advertisement
×