E-Paper
Advertisement

Vijayawada: ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

Vijayawada: ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
Advertisement

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో జరిగిన అవకతవకల గురించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

అసలేం జరిగిందంటే..
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి భక్తులు సమర్పించిన చీరలను వేలంపాట ద్వారా ఆలయ అధికారులు అమ్మకాలు సాగిస్తారు. అయితే 2018 – 19 మధ్య జరిగిన అమ్మకాలలో కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందంటూ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగిందని గుర్తించగా, చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించిన ఈవో భ్రమరాంబకు, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం కు దేవాదాయ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై హైకోర్టును సుబ్రహ్మణ్యం ఆశ్రయించారు.

Advertisement

Also Read: Vijayasai Reddy: సాయిరెడ్డి సైలెంట్ పాలి’ట్రిక్స్’.. న్యూటర్న్ నిజమేనా?

హైకోర్టులో తాజాగా వాదనలు జరగగా, న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎండోమెంట్ అధికారితో చీరల అమ్మకాల్లో జరిగిన అవినీతిపై విచారణ సాగించాలన్నారు. పూర్తి విచారణ జరిగే వరకు ఎటువంటి పెనాల్టీలు, చర్యలు తీసుకోవద్దని దేవదాయ శాఖ అధికారులను హైకోర్టు సూచించింది. కాగా సాధ్యమైనంత త్వరగా జిల్లా ఎండోమెంట్ అధికారితో విచారణ నిర్వహించేందుకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×