BigTV English

Rajini: మంత్రి రజినీకి హైకోర్టు నోటీసులు.. జగన్ కు ఝలక్!

Rajini: మంత్రి రజినీకి హైకోర్టు నోటీసులు.. జగన్ కు ఝలక్!
Advertisement

Rajini: సీఎం జగన్ పాలనలో హైకోర్టు మెట్లు ఎక్కేవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో సీఎస్, డీజీపీతో సహా.. పలువురు ఉన్నతాధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడ్డారు. కొందరికి శిక్షలు కూడా పడ్డాయి. ఆ తర్వాత క్షమాపణలూ వచ్చాయి. తాజాగా, జగన్ కేబినెట్ లోని మంత్రి విడదల రజినీకి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.


నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇచ్చారనే అంశంలో మంత్రి రజినీకి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఎన్టీఆర్‌ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. మంత్రి విడదల రజినీకి నోటీసులు జారీ చేసింది.

మంత్రి రజినీ మాత్రమే కాదు.. ఇదే కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. స్థానిక తహసీల్దార్‌కు సైతం నోటీసులు అందాయి. గ్రానైట్ తవ్వకాల వ్యవహారంలో అసలేం జరిగిందో తెలపాలంటూ ఆ ముగ్గురికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.


గ్రానైట్ తవ్వకాలపై టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ పాలనలో అంతా అవినీతిమయం అని, ఖనిజ సంపదను ఇష్టారాజ్యంగా దోచుకుంటోందని ఎప్పటినుంచో విమర్శలు చేస్తోంది. దేవినేని ఉమా, పట్టాభి లాంటి వారు గతంలో అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. అప్పుడు అధికార పార్టీ వారిపై ఎదురుదాడి చేసింది. అంతా సవ్యంగానే సాగుతోందని చెప్పింది.

అయితే, ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో అసైన్డ్ భూమిలో గ్రానైట్ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ పై మంత్రి విడదల రజినీతో పాటు ఎంపీ అవినాశ్ మామ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నోటీసులు అందడంతో టీడీపీ తమ విమర్శలకు మరింత పదును పెంచింది.

Related News

Vizag News: విశాఖపై రహేజా సంస్థ ఫోకస్.. రూ.2,172 కోట్లతో భారీగా అభివృద్ధి పనులు

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Big Stories

×