E-Paper
Advertisement

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?
Advertisement

Crime News: భార్య అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేశారని కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. కృతిక రెడ్డి డెర్మటాలజిస్ట్, మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్ వీరు బెంగుళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు. ఇద్దరు ఒకే హాస్పిటల్‌లో పనిచేయడంతో వారి తల్లిదండ్రులు వాళ్లకి వివాహం చేశారు. కృతికకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. తనకి ముందే చెప్పకపోవడంతో ఇద్దరి మద్య ఘర్షణ ఏర్పడింది. దీంతో కృతికరెడ్డిని చంపాలని నిర్ణయించుకొని.. ఆపరేషన్ థియేటర్లో వినియోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేశాడు మహేంద్ర రెడ్డి. నిందితుడు కృతికరెడ్డిది సహజ మరణంగా తల్లిదండ్రులను నమ్మించాడు. బాధితురాలి అక్కకి అనుమానం రావడంతో.. వైద్య పరీక్షలు చేయించింది. ఆరు నెలల తర్వాత ఫారెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికలో హత్యగా గుర్తించారు. దీంతో నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా..  హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×