E-Paper
Advertisement

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్య అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేశారని కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. కృతిక రెడ్డి డెర్మటాలజిస్ట్, మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్ వీరు బెంగుళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు. ఇద్దరు ఒకే హాస్పిటల్‌లో పనిచేయడంతో వారి తల్లిదండ్రులు వాళ్లకి వివాహం చేశారు. కృతికకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. తనకి ముందే చెప్పకపోవడంతో ఇద్దరి మద్య ఘర్షణ ఏర్పడింది. దీంతో కృతికరెడ్డిని చంపాలని నిర్ణయించుకొని.. ఆపరేషన్ థియేటర్లో వినియోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేశాడు మహేంద్ర రెడ్డి. నిందితుడు కృతికరెడ్డిది సహజ మరణంగా తల్లిదండ్రులను నమ్మించాడు. బాధితురాలి అక్కకి అనుమానం రావడంతో.. వైద్య పరీక్షలు చేయించింది. ఆరు నెలల తర్వాత ఫారెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికలో హత్యగా గుర్తించారు. దీంతో నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా..  హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×