E-Paper
Advertisement

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?
Advertisement

Crime News: భార్య అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేశారని కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. కృతిక రెడ్డి డెర్మటాలజిస్ట్, మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్ వీరు బెంగుళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు. ఇద్దరు ఒకే హాస్పిటల్‌లో పనిచేయడంతో వారి తల్లిదండ్రులు వాళ్లకి వివాహం చేశారు. కృతికకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. తనకి ముందే చెప్పకపోవడంతో ఇద్దరి మద్య ఘర్షణ ఏర్పడింది. దీంతో కృతికరెడ్డిని చంపాలని నిర్ణయించుకొని.. ఆపరేషన్ థియేటర్లో వినియోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేశాడు మహేంద్ర రెడ్డి. నిందితుడు కృతికరెడ్డిది సహజ మరణంగా తల్లిదండ్రులను నమ్మించాడు. బాధితురాలి అక్కకి అనుమానం రావడంతో.. వైద్య పరీక్షలు చేయించింది. ఆరు నెలల తర్వాత ఫారెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికలో హత్యగా గుర్తించారు. దీంతో నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా..  హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×