E-Paper
Advertisement

Chandrababu: కోపంతో ఊగిపోయిన చంద్రబాబు.. కుప్పంలో పోలీస్ వర్సెస్ టీడీపీ

Chandrababu: కోపంతో ఊగిపోయిన చంద్రబాబు.. కుప్పంలో పోలీస్ వర్సెస్ టీడీపీ
Advertisement

Chandrababu: చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. పోలీసులపై నిప్పులు చెరిగారు. డీఎస్పీపై కోపంతో ఊగిపోయారు. మీదిమీదకు వెళ్లారు. పోలీస్ అధికారులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తన ర్యాలీని అడ్డుకోవడమేంటి? ఇదేమి రాజ్యం అంటూ మండిపడ్డారు. పెద్ద ఎత్తున చేరిన టీడీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్దూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు జీవో నెంబర్ 1 ప్రకారం పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రించారు. ఎస్‌.గొల్లపల్లి దగ్గర పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో.. మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి.

Advertisement

అయితే, ఎలాగైనా కుప్పంలో పర్యటించి తీరుతానంటూ చంద్రబాబు పంతం పట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచి కర్నాటక బోర్డర్ గుండా కుప్పంలో అడుగుపెట్టారు.

అప్పటికే పోలీసు నిర్బంధాలు చేధించుకుని వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. కుప్పం సరిహద్దుల్లో శాంతిపురం మండలం జేపీ కొత్తూరు దగ్గర చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు.

Advertisement

మరోవైపు, పర్యటనకు అనుమతి లేదని పెద్దూరులో చంద్రబాబును అడ్డుకున్నారు పోలీసులు. స్థానిక డీఎస్పీ చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. తన ర్యాలీని ఎందుకు అనుమతించరంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. మైకులకు అనుమతి లేదని, ఇంటింటి ప్రచారం మాత్రం చేసుకోవచ్చని పోలీసులు చంద్రబాబుకు చెప్పారు. కండిషన్లు లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. ఈ సందర్భంగా పెద్దూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

వేల జన్మలు ఎత్తినా కుప్పంలో గెలిచేది టీడీపీనే అన్నారు చంద్రబాబు. ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలన్నారు చంద్రబాబు. నా సొంత నియోజకవర్గానికి నన్ను వెళ్లనీయరా? నా ప్రజలను నేను కలవకూడదా? వైసీపీకి ఓ రూల్.. నాకో రూలా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పనైపోయిందని ప్రజలు డిసైడ్ అయిపోయారని.. అందుకే తన సభలకు తండోపతండాలుగా తరలివస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×