E-Paper
Advertisement

Tadipatri: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. టీడీపీ Vs వైసీపీ నేతల మధ్య మళ్లీ ఫైట్?

Tadipatri: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. టీడీపీ Vs వైసీపీ నేతల మధ్య మళ్లీ ఫైట్?
Advertisement

High Tension in Tadipatri: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. తాడిపత్రిలో మరోసారి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ ఘర్షణలో వైసీపీకి చెందిన వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించిన ఇంటిపై కూడా దాడి జరిగిందని, ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం అయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. పలువురు వైసీపీ నేతలను తాడిపత్రి నుంచి పంపించివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు.. ఫ్యామిలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Advertisement

ఈ ఘటనపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. తాడిపత్రిలో ప్రశాంతతను కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారంటూ అందులో పేర్కొన్నారు.

అదేవిధంగా ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనని తాడిపత్రికి రానివ్వకుండా ఇటువంటి గొడవలు చేస్తున్నారన్నారు. తనకు ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటానన్నారని అందులో స్పష్టం చేశారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×