E-Paper
Advertisement

కల్వర్టులో దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు, స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు, అనంతపురంలో రోడ్డు ప్రమాదం

కల్వర్టులో దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు, స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు, అనంతపురంలో రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు కల్వర్టు నుంచి కింద పడ్డాయి. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది?

 

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

 

అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామిడి మండలం పొగరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ లారీని ఢీ కొని కల్వర్టులో బోల్తా పడింది ట్రావెల్ బస్సు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. అందులో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలియగానే పోలీసులు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.

Advertisement

 

ట్రావెల్ బస్సు-లారీ ఢీ, కల్వర్టులోకి దూసుకెళ్లిన వాహనాలు

 

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది లారీ. అయితే ఆదివారం ఉదయం పొగరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కల్వర్టులోకి పడిపోయాయి. ఘటన గురించి తెలియగానే స్థానికులు డ్రైవర్లను బయటకు తీశారు. అతి వేగం, నిద్ర మత్తు ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

ట్రావెల్ బస్సులో 20 మంది ప్రయాణికులకు గాయాలు

 

ఘటన సమయంలో బస్సులు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన ప్రమాదం గురించి పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తోంది? ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. ఎస్ఐపై దాడి చేసిన చింతాడ రవి అరెస్ట్ 

Related News

జగన్‌కు కొత్త సమస్య.. వైసీపీలో టెన్షన్ మొదలు, ఏం జరిగింది?

జగన్ పర్యటనలో ఎస్సైపై దాడిచేసిన.. చింతాడ రవి అరెస్ట్!

మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

2029 లో మీరు జీరో అవ్వడం పక్కా.. వైసీపీ పార్టీ పై మంత్రి నారాయణ షాకింగ్ కామెంట్స్!

తిరుపతి సోనోవిజన్‌ షాప్‌లో భారీ చోరీ.. 50 ఐఫోన్లు, 100 స్మార్ట్‌ఫోన్లు గాయబ్!

జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత

టీడీపీ ఆదేశంతో చలసాని బిగ్ డెసిషన్.. కృష్ణా డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా!

Big Stories

Advertisement
×