BigTV English

Summons to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాకింగ్.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఆ తేదీన హాజరు కావాలన్న కోర్టు

Summons to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాకింగ్.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఆ తేదీన హాజరు కావాలన్న కోర్టు

Summons to Pawan Kalyan: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు భారీ షాకిచ్చింది. ఇటీవల న్యాయవాది రామారావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు పవన్ కు సమన్లు జారీ చేసింది.


తిరుమల లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయం నుండి యావత్ భారత్.. ఆ విషయానికి సంబంధించిన ప్రతి వార్తపై దృష్టి సారించింది. దీనికి ప్రధాన కారణం నిరంతరం కోట్లాది మంది భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. అందులో తిరుమల లడ్డును ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు భక్తులు.

అటువంటి లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందంటూ రాజకీయ ఆరోపణలు వెలుగులోకి రాగా.. కూటమి వర్సెస్ వైసీపీ లక్ష్యంగా విమర్శలు సైతం సాగాయి. ఆ విమర్శలతో వైసీపీ నేతలు.. అత్యున్నత నాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ అధ్వర్యంలో విచారణ సాగించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ విమర్శల కోసం.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ పార్టీలకు సూచించింది.


Also Read: Special Story: పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ‘కండిషన్స్’ అప్లై, అమ్మాయిల డిమాండ్లు ఏంటి సామి ఇలా ఉన్నాయ్?

ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయాశ్చిత్త దీక్ష చేపట్టి.. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించి దీక్ష విరమించారు. అంతటితో ఆగక తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభ సాక్షిగా పవన్.. వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ.. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని ప్రకటించారని, దీనితో కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చేసిన ప్రసంగంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ ను దాఖలు చేశారు. కోట్లాది మంది భక్తులు స్వీకరించే తిరుమల లడ్డు గురించి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని పిటీషనర్ పేర్కొన్నారు. అలాగే పవన్ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాల నుండి తొలగించేలా, ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

దీనితో న్యాయస్థానం విచారణకు పిటీషన్ స్వీకరించి, నవంబర్ 22న పవన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీనితో పవన్ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. అయితే పవన్ కోర్టుకు వస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×