RTC Bus Fire Accident: పార్వతీపురం మన్యం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒరిస్సాకి చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్దమైంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.