BigTV English
Advertisement

Illegal mining case: క్వారీ కేసు.. అరెస్ట్ భయంతో కాకాణి జంప్

Illegal mining case: క్వారీ కేసు.. అరెస్ట్ భయంతో కాకాణి జంప్

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి రెండు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈరోజు పోలీసులు ఆయన ఇంటికి వచ్చిన అక్రమ క్వారీ నిర్వహణ కేసులో నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన వస్తారని వేచి చూసినా రాలేదు, ఫోన్లో సంప్రదించాలని చూసినా ఫలితం లేదు. చివరకు ఆయన ఇంటి గేటుకి పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారు.


అసలేంటి కేసు..?
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రుస్తుం మైన్స్ ఉంది. అందులోనుంచి క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అక్రమంగా తరలించారనేది కేసు. అంతే కాదు, ఇక్కడ అనధికారికంగా పేలుడు పదార్థాలను వినియోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అభియోగాల కింద పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. కొంతమందిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కాకాణి అరెస్ట్ కూడా తప్పదని అనుకున్నారంతా. ఈరోజు కాకాణి ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన అక్కడ లేరు. దీంతో ఇంటి గేటుకి పోలీసులు నోటీసులు అంటించారు.


అజ్ఞాతంలో కాకాణి..
అరెస్ట్ భయంతో కాకాణి రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆయన అరెస్ట్ లకు తాను భయపడేది లేదంటూ గతంలో గంభీరంగా మాట్లాడేవారు. పోలీసులు అరెస్ట్ చేసినా బెయిల్ వస్తుందనేది ఆయన ధీమా. అయితే పోలీసులు తెలివిగా వరుస సెలవల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే అనుమానం వచ్చింది. అందుకే సెలవలకు ముందే ఆయన నెల్లూరు నుంచి జంప్ అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా పార్టీ నేతలకు తెలియదంటున్నారు.

నోటీసుల్లో ఏముంది..?
క్వారీ అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు కాకాణి ఇంటికి వెళ్లారు పొదలకూరు ఎస్సై హనీఫ్. ఆయన లేకపోవడంతో రెండు గంటల సేపు అక్కడే ఉన్నారు. చివరకు గేటుకి నోటీసులు అంటించి వచ్చారు. ఈనెల 31, సోమవారం ఉదయం 11 గంటలకల్లా కాకాణిని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

గతంలో కూడా కాకాణిపై పలు కేసులు ఉన్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి ఆస్తుల గురించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోర్టులో సాక్ష్యాల దొంగతనంలో కూడా ఆయన హస్తం ఉందని ఆరోపణలు వినిపించాయి. తాజాగా అక్రమంగా క్వార్ట్జ్ తరలించారనే కేసు నమోదైంది. ఈ కేసునుంచి కాకాణి తప్పించునే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఆయన పరారీలో ఉన్నారని తెలుస్తోంది.

సర్వేపల్లిలో వరుస విజయాలు సాధించిన కాకాణి గత ఎన్నికల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి ఆయన దూకుడు కాస్త తగ్గింది. అయితే నెల్లూరు జిల్లా నుంచి ఒక్క వైసీపీ నేత కూడా గెలవకపోవడంతో జగన్ కి ఆయనే దిక్కయ్యారు. దీంతో ఎన్నికల తర్వాత కాకాణికి మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఇటీవల కాకాణి నిరసన కార్యక్రమాలతో హడావిడి మొదలు పెట్టారు. ఈలోపు ఆయనపై కేసు నమోదు కావడం విశేషం.

Related News

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Big Stories

×