E-Paper
Advertisement

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి
Advertisement

Inter Student Murder Attempt On College AO: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరుచానూరులో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఫీజు వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి ఆ కళాశాల ఏఓపై కత్తితో దాడి చేశాడు. దీంతో కళాశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో కళాశాలలో భయంకర వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. తిరుపతిలోని తిరుచానూరులో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ విద్యార్థి ఫీజు బకాయి ఉండడంతో హాస్టల్‌కు పంపించకుండా ఆ కళాశాల ఏఓ క్యాంపస్‌లోనే ఉంచినట్లు ఆరోపించారు. అయితే ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగిందని సమాచారం.

Advertisement

సంక్రాంతికి బకాయి ఫీజులను చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఏఓ వినలేదని ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చినా వినకుండా అనవసరంగా బ ూతులు తిట్టినట్లు ఆరోపించారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థి మానసిక స్థితి బాలేదని ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు.

అంతకుముందు విద్యార్థికి, ఏఓకు మధ్య గొడవ జరిగింది. దీంతో కళాశాలలో ప్రిన్సిపల్ దగ్గర ఏఓ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆ విద్యార్థి కత్తితో పొడిచినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఏఓ వెంకటరమణకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Also Read:  పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ప్రిన్సిపల్ తో మాట్లాడారు. ప్రస్తుతం ఆ మైనర్ విద్యార్థి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×