E-Paper
Advertisement

Tenth class students: రేపు పదో తరగతి పరీక్ష ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ..

Tenth class students:  రేపు పదో తరగతి పరీక్ష ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ..
Advertisement

Tenth class students: ఏపీ రాష్ట్ర టెన్త్ విద్యార్థులకు ఇది అలెర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన టెన్త్ క్లాస్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించాలని విద్యాధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు సర్కార్ రేపు ఆప్షణల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు జరగాల్సిన టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగుతోందా..? లేదా..? అనే దానిపై విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. దీనిపై విద్యాశాఖ అధికారులు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆప్షనల్ హాలిడేకు టెన్త్ క్లాస్ పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రేపు ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన ఎగ్జామ్ లో ఎలాంటి మార్పు ఉండదని రేపు జరగబోయే పరీక్ష యథావిధిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45  గంటల వరకు సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుందంని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఎగ్జామ్ కోసం చదవాలని సూచించారు.

Advertisement

ALSO READ: EIL Recruitment: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.2,00,000.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..

ALSO READ: Group-1 Results: పండుగ పూట గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. జనరల్ ర్యాకింగ్స్ విడుదల

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×