E-Paper
Advertisement

Jagan and Vijayamma: వైఎస్ఆర్‌కు జగన్, విజయమ్మ నివాళి, మిస్ యూ డాడ్ అంటూ..

Jagan and Vijayamma: వైఎస్ఆర్‌కు జగన్, విజయమ్మ నివాళి, మిస్ యూ డాడ్ అంటూ..
Advertisement

Jagan and Vijayamma: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్థంతి నేడు.  ఈ సందర్భంగా పులివెందులలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు.

సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వైఎస్ఆర్ వైఫ్ విజయమ్మ, తనయుడు, మాజీ సీఎం జగన్, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.

Advertisement

రాయలసీమకు చెందిన వైఎస్ఆర్ బంధువులు, వైసీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. అలాగే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు.

ALSO READ: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..

Advertisement

ఘాట్ వద్ద జగన్.. తన తండ్రికి నివాళులు అర్పిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్ యు డాడ్ అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చేశారు. అనంతరం పులివెందులలో తన నివాసం వద్ద ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం పులివెందుల నుంచి రోడ్ మార్గంలో తాడేపల్లికి చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్. మంగళవారం ఆయన విదేశాలకు వెళ్లనున్నారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా  ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే నేతగా వైఎస్సార్ లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదన్నారు. భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా,  ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారని, నాన్న ఆశయాలే తనను చేయి పట్టి నడిపిస్తున్నాయని వెల్లడించారామె.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×