BigTV English
Advertisement

Jagan Comments: ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు: జగన్

Jagan Comments: ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు: జగన్

Jagan Comments on Chandrababu: ఆ సైకిల్ కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు.. ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు.. సైకిల్ లో పనిచేసే ఒకే ఒక్క పార్ట్ బెల్.. అది మేనిఫెస్టోలోని అబద్ధాలను ప్రచారం చేస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయించాలని చంద్రబాబు అవస్థలు పడుతున్నారన్నారు. సైకిల్ రిపేర్ చేయడానికి దత్త పుత్రుడిని ఆశ్రయించినా ఫలితం రాలే.. ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపి సైకిల్ రిపేర్ కు చంద్రబాబు యత్నాలు చేశారు.. ఢిల్లీ మెకానిక్ లు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.. సైకిల్ కు ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు.. ఆ సైకిల్ కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు.. సైకిల్ లో పనిచేసే ఒకే ఒక్క పార్ట్ బెల్.. అది మేనిఫెస్టోలోని అబద్ధాలను ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.

మేనిఫెస్టోతో ఊదరగొడుతున్న చంద్రబాబు గతంలో ఎన్ని హామీలు నెరవేర్చావంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేయిస్తూ పథకాలు ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం పేరైనా గుర్తొస్తుందా? అని ఆయన అన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని జగన్ అన్నారు.


‘రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్వహిస్తాయి. పొరపాటున చంద్రుబాబుకు ఓటు వేస్తే చంద్రబాబును నిద్రలేపడమే అవుతుంది. టీడీపీకి ఓటు వేస్తే పతకాల ముగింపే. 59 నెలలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ. 3 వేల పెన్షన్, రేషన్, పౌర సేవలు. నాడు-నేడుతో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థ. స్వయం ఉపాధికి అండగా నిలిచాం. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ చేశాం. వివధ పథకాల ద్వారా రూ. 2.70 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అందించాం. ఏ పథకం ఎప్పుడు వస్తుందో.. ఏకంగా క్యాలెండర్ ఇచ్చింది మీ బిడ్డనే పాలనలోనే. మళ్లీ జగనే వస్తాడు.. మీ పథకాలన్నీ అందిస్తాడు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

‘టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. కానీ, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరుగుతుందోననేది మీ ఇంట్లో చర్చించి ఓటేయండి’ అంటూ జగన్ అన్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×