E-Paper
Advertisement

Jagan with Sailajanath: షర్మిలపై ఫోకస్.. జగన్‌తో శైలజానాథ్ మంతనాలు

Jagan with Sailajanath: షర్మిలపై ఫోకస్.. జగన్‌తో శైలజానాథ్ మంతనాలు

Jagan with Sailajanath: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు.. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలీదు. కాకపోతే పైచేయి సాధించేందుకు మాత్రం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగు తోంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోకుండా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్‌తో మంతనాలు వెనుక ఏం జరిగింది?

రాజకీయాల్లో ఎత్తులు వేయడంలో జగన్‌కు తిరుగులేదని కొందరు చెబుతుంటారు. గడిచిన ఐదేళ్లలో అదే చేశారు. ఫలితం రివర్స్ అయ్యింది. పార్టీ నుంచి నేతలు వలస పోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు మాజీ సీఎం. ప్రత్యర్థులను ఎదుర్కొనే  బదులు పార్టీ బలంగా ఉండేలా స్కెచ్ వేశారు.

ఐదేళ్ల జగన్ పాలనను చూసిన ఆ పార్టీ నేతలు.. ఫ్యాన్‌కు లైఫ్ లేదనే భావనకు వచ్చారు. ఈక్రమంలో వలస బాట పడుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. కాంగ్రెస్ నేతలను రప్పించుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుందని ఆలోచన చేస్తున్నారట.

జగన్ ఆలోచనకు తగ్గట్టుగా అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం కర్నూలు లో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు.

ALSO READ: ఎవరున్నా, లేకున్నా సరే.. జగన్‌‌కు అంత ధీమా ఏంటో!

ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్టు ఓ వార్త గుప్పుమంది. దాదాపు అరడజను నేతలతో మాట్లాడారట. మాజీ పీసీసీ చీఫ్ రేపోమాపో వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్‌తోపాటు మరికొందరు నేతలున్నట్లు అంతర్గత సమాచారం.

జగన్ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే వైసీపీ ఉండదని భావిస్తున్నారట. తన చెల్లెలు షర్మిలను రాజకీయంగా అడ్డుకట్ట వేస్తే తనకు తిరుగు వుండదని మాజీ సీఎం ఆలోచన. అటు కాంగ్రెస్‌ను వీక్ చేసినట్టు ఉంటుంది.. ఇటు వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నేతల భావన. వైసీపీ స్కెచ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×