BigTV English

YS Jagan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే ?

YS Jagan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే ?

YS Jagan news today(Latest political news in Andhra Pradesh):

వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యురిటీని తొలగించినట్టు జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.


తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్లు తెలిపారు. తనను అంతమొందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో తెలిపారు.

టీడీపీ తనకు భద్రత తగ్గించిందని ఆరోపించారు. భద్రత తగ్గింపు విషయంపై తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో తనకు ఉన్న భద్రత పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే జగన్ ఆరోపణలను పోలీసులు, ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. సీఎం మోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే కుదించినట్లు తెలిపారు. రూల్స్ ప్రకారమే జగన్ కు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. సీఎం స్థాయి భద్రత కల్పించడం వీలు కాదని స్పష్టం చేశారు. మరో వైపు జగన్ పిటిషన్ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: పిన్నెల్లికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

జగన్ వినుకొండ పర్యటన సందర్భంగా భద్రత గురించి చర్చ జరిగింది. ఫిట్ నెస్ లేని వాహనం కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ.. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసి వేరే కారులో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అయితే దీనిై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. కండీషన్ లో లేని వాహనాన్ని ఇచ్చారనే ఆరోపణలను తోసిపుచ్చారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ జగన్ కు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

Related News

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Big Stories

×