BigTV English
Advertisement

Jagan : ఆ పులితో చంద్రబాబుకు పోలిక.. జగన్ చెప్పిన పొలిటికల్ పంచతంత్ర కథ..!

Jagan : ఆ పులితో చంద్రబాబుకు పోలిక.. జగన్ చెప్పిన పొలిటికల్ పంచతంత్ర కథ..!

Jagan : ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ దూకుడును మరింత పెంచారు. తాజాగా అనంతపురం జిల్లా నార్పల బహిరంగ సభలో పాల్గొన్న సీఎం.. జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.912.71 కోట్ల నగదును 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ వేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. ఒక ముసలాయన జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చారని బాబుపై సెటైర్లు వేశారు. ఆయన మాటలు వినేప్పుడు.. పంచతంత్రంలోని ఓ కథ గుర్తొంచిందని తెలిపారు.


“అనగనగా ఓ పులి ఉండేది. నరమాంసం తినేది. కొన్నాళ్లకు ముసలిదైపోయింది.వేటాడే శక్తి, పరుగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. 4 నక్కలను తోడేసుకుంది. మనుషులను ఎలా తినాలనే ప్లాన్‌ వేసుకుంది. ఓ మడుగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగలను ఆశ చూపించేది. తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి అంటూ ఊరించేది. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లు మడుగులోకి వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదలో వారు ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, మాయమాటలు చెప్పేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని. ఈ కథ వింటే అబద్ధాలు చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు”అని జగన్ సెటైర్లు వేశారు.

వేటాడే శక్తి కోల్పోయిన పులి.. గుంట నక్కలను వెంటేసుకుని తిరిగినట్లుగా చంద్రబాబు తీరు ఉందని జగన్ విమర్శించారు. ఇలాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదని ప్రజలకు సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారని విమర్శించారు.


దోచుకో, పంచుకో..తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతమని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉందని .. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు ఉన్నారని మండిపడ్డారు. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండని ప్రజలకు సూచించారు. జగన్ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది ఆలోచండి అని అన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల దీవెనలు తనకు కావాలి అని జగన్ కోరారు.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×