E-Paper
Advertisement

Jagan Tour: జగన్ టూర్‌కి పర్మిషన్ ఓకే.. సరదా, సందడికి బ్రేకులు

Jagan Tour: జగన్ టూర్‌కి  పర్మిషన్ ఓకే.. సరదా, సందడికి బ్రేకులు

Jagan Tour:  జగన్ చిత్తూరు టూర్ మళ్లీ గొడవకు వేదిక అవుతుందా? ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా జగన్ యాత్ర సాగుతుందా? ఇన్నాళ్ల మాదిరిగా బల ప్రదర్శనకు పోలీసులు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదా? తక్కువ మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారా? పల్నాడు తరహా మారిదిగా జరిగితే శాశ్వతంగా జగన్ టూర్లకు బ్రేక్ పడనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీ అధినేత జగన్ టూర్లు అనే సరికి భారీ కాన్వాయ్ ఉంటుంది. దీనికితోడు జన సమీకరణ గురించి చెప్పనక్కర్లేదు. గతంలో రాప్తాడు, ఒంగోలు, పల్నాడు పర్యటనలే ఇందుకు ఓ ఎగ్జాంఫుల్. అవన్నీ గమనించిన తర్వాత చిత్తూరు పోలీసులు జగన్ టూర్‌పై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జూలై 9న బంగారు పాళ్యం పర్యటనకు జగన్‌ వెళ్లనున్నారు. దీనికి చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు.

కఠినమైన షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు విస్తీర్ణంలో తక్కువగా ఉంది. జగన్‌తోపాటు మరో 500 మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు. ఎక్కువ మంది వస్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.  హెలిప్యాడ్‌ వద్దకు కేవలం 30 మందికి అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు కూడా. ఎలాంటి ర్యాలీలు, రోడ్డు షోలు చేయకూడదన్నది మరో కీలకమైన పాయింట్. ఈ మేరకు వైసీపీ నేతలకు పోలీసులు సమాచారం ఇచ్చారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, ఈసారి జగన్ పర్యటనకు జాగ్రత్తలు అలాగే తీసుకుంటున్నారు.

ALSO READ: విజయవాడలో ఆసమస్యకు ఫుల్‌స్టాప్.. ఒకేసారి 500 కార్లు

జగన్ చిత్తూరు పర్యటనకు 10 వేల మంది వస్తారని, అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసుకుంటామని గతవారం పోలీసులను వైసీపీ నేతలు కోరారు. అందుకు ససేమిరా అన్న పోలీసులు, ఆంక్షలు విధించారు. పల్నాడు ఘటనలో 113 మంది నేతలు, కేడర్‌పై కేసులు నమోదయ్యాయి. వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో జగన్ టూర్‌కు అంతమంది రాకపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మామిడి సీజన్ ముగిసిన తర్వాత రైతులతో జగన్ మాట్లాడడం విడ్డూరం కాకపోతే ఏంటన్నది మరోవైపు బలంగా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. తోతాపురి మామిడి రకానికి ధరలు తగ్గినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ ప్రధాన వాదన. ఈ క్రమంలో రైతులను పరామర్శించనున్నారట జగన్.

మొన్నటికి మొన్న కుప్పం వెళ్లిన సీఎం చంద్రబాబు, చిత్తూరు జిల్లా మామిడి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. అంతా అయిన తర్వాత ఇప్పుడు జగన్ వెళ్లడం అనవసరమని వైసీపీలోని కొందరు నేతల మాట. ఈసారి జగన్ పర్యటనలో ఏమైనా గందరగోళం జరిగితే శాశ్వతంగా ఆయన యాత్రలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట పోలీసులు.

 

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×