E-Paper
Advertisement

JanaSena: ఉప్మా పాలిటిక్స్.. బడ్జెట్ పద్మనాభంకు ఇచ్చిపడేసిన జనసైన్యం..

JanaSena: ఉప్మా పాలిటిక్స్.. బడ్జెట్ పద్మనాభంకు ఇచ్చిపడేసిన జనసైన్యం..
Advertisement

JanaSena party latest updates(AP political news): రాజకీయమంటే ఇదే. చిన్న పాయింట్‌ను పట్టుకుని పెద్దగా లాగడమే. పవన్ టార్గెట్‌గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి కాపు ఉద్యమానికి ఎంతో సహకరించారని పొగిడారు. జనసేనాని ద్వారంపూడిని తిట్టడాన్ని తప్పుబట్టారు. అక్కడితో మేటర్ క్లోజ్.

కట్ చేస్తే.. మరో సభలో ఉప్మా కథ చెప్పారు పవన్ కల్యాణ్. వైసీపీ వ్యతిరేకులంతా ఐకమత్యంగా ఉండాలనేది.. లేదంటే మళ్లీ వైసీపీనే గెలుస్తుందనేది ఆ ఉప్మా స్టోరీ సారాంశం. ఇంకేం.. ఈ ఉప్మా పాయింట్‌ను వెంటనే తమకు అనుకూలంగా.. ముద్రగడకు కౌంటర్‌గా ఫుల్‌గా వాడేసుకుంటున్నారు జనసైనికులు.

Advertisement

ద్వారంపూడి కాపు ఉద్యమం కోసం ఏం చేశారని.. ఆనాటి కాపు సభలో ఉప్మా పెట్టించింది ఆయనేనా అంటూ విమర్శించారు. అలాగైతే ద్వారంపూడి పెట్టిన ఉప్మా ఖర్చును తిరిగి ఇచ్చేయాలంటూ.. ముద్రగడ పద్మనాభంకు తనవంతుగా రూ.1000 మనీయాడర్ పంపించారు జనసేన నాయకుడు పంతం నానాజి. ఆ మాత్రం హింట్ ఇస్తే చాలని.. ఇక చెలరేగిపోయారు కాకినాడ జనసైనికులు.

పవన్ ఫ్యాన్స్ పోస్టాఫీసు ముందు క్యూ కట్టారు. ఎందుకంటే.. ముద్రగడకు ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు. వరుసబెట్టి పద్మనాభంకు తమకు తోచినంత మనీయాడర్ చేశారు. మా డబ్బులన్నీ తీసుకొని.. కాపు ఉద్యమం కోసం ద్వారంపూడి చేసిన ఆర్థిక సాయాన్ని తిరిగిచ్చేయమని ముద్రగడకు సూచించారు.

Advertisement

జనసైనికుల ఈ ఎత్తగడ సూపర్బ్‌గా వర్కవుట్ అయిందని అంటున్నారు. పవన్.. కాకినాడ ఎమ్మెల్యేను తిట్టడం.. జనసేనానిని తప్పుబడుతూ ముద్రగడ లేఖ రాయడం.. ద్వారంపూడి ఆర్థిక సాయం చేశాడని చెప్పడం.. పవన్ ఉప్మా కథ వినిపించడం.. జనసైనికులు ఉప్మా డబ్బులు మనీయాడర్ చేయడం.. అబ్బో కాకినాడలో రంజుగా సాగుతోంది ఉప్మా పాలిటిక్స్.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×