E-Paper
Advertisement

Varahi: ఇక విశాఖలో వారాహి.. వ్యూహం మార్చేసిన జనసేనాని!

Varahi: ఇక విశాఖలో వారాహి.. వ్యూహం మార్చేసిన జనసేనాని!
Advertisement
varahi-yatra

Varahi: గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర పూర్తైంది. నెక్ట్స్ విశాఖలో విజయ విహారానికి రెడీ అవుతోంది. పట్టున్న ప్రాంతాల్లో ముందుగా పని పూర్తి చేయాలనేది జనసేనాని వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, ముందుగా తన ఇలాఖా అయినా గోదావరి జిల్లాలను చుట్టేశారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఏరియాను ఇప్పటికే కవర్ చేసేశారు. ఎన్నికల నాటికి మళ్లీ ప్రచారానికి రాలేక పోయినా.. ఇంకేం పర్వాలేదనేలా వారాహి యాత్ర కొనసాగింది. పవన్ కల్యాణ్ సభలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జగన్ సర్కారును జనాల ముందు దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో.. నేను లోకల్.. తరహాలో తొలివిడత వారాహి విజయవంతమైందనే చెప్పాలి.

నెక్ట్స్ ఎక్కడ? అని గట్టి కసరత్తే చేసింది జనసేన. పవన్‌కు స్టేట్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచే బరిలో దిగారు జనసేనాని. ఆ రెండుచోట్ల తనకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని భావించారు. ఆ లెక్కన.. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు విశాఖలోనే బలమెక్కువ. అందుకే, ఈసారి వారాహి విజయయాత్ర అక్కడే.

Advertisement

అందులోనే, విశాఖ రాజకీయంగా కీలక ప్రాంతంగా మారింది. మూడేళ్ల క్రితమే ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రభుత్వం ప్రకటించడం.. త్వరలోనే విశాఖ నుంచి పాలనంటూ ఏడాదిగా ఊదరగొడుతుండటంతో.. ఆ విశాఖలోనే జగన్ సర్కారుతో తేల్చుకునేందుకు ముందుకొస్తున్నారు పవన్ కల్యాణ్. రాజధాని పేరుతో భూదందా, వైసీపీ నేతల భూకబ్జా, రుషికొండ తవ్వకాలు, భీమిలీ బీచ్ అరాచకాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ఇలా మాట్లాడటానికి, పూనకంతో ఊగిపోవడానికి చాలా అంశాలే ఉన్నాయి విశాఖ చుట్టూ. వారాహి యాత్రకు కావలసినంత ముడిసరుకు ఉండటంతో.. గోదావరి తర్వాత విశాఖనే ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×