E-Paper
Advertisement

Ysrcp leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..

Ysrcp leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..

Ysrcp leaders: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు చిన్న ఊరట లభించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, 48 గంటల్లో పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఐదుగురు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నుంచి ఆయా నేతలు అందుబాటులో లేరు. నేతల పిటిషన్లను విజయవాడ న్యాయస్థానం, హైకోర్టు రిజెక్ట్ చేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాకపోతే అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పిస్తూనే పలు షరతులు విధించింది.

ALSO READ: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించే పనిలోపడ్డారు. ఈ క్రమంలో దేవినేని అవినాశ్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇందులోభాగంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.  వైసీపీ నేతల తరపున కపిల్ సిబల్, అల్లంకి రమేష్.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్‌ లుత్రా  న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు.

ఇరువర్గాల వాదనలు విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం..  పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాదు కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. మూడువారాల వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ నాలుగుకు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌పై అదే రోజు తేల్చనుంది న్యాయస్థానం.

2021 అక్టోబరు 19న దాదాపు 200 మంది టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఆఫీసుకి సంబంధించిన ఫర్మీచర్ డ్యామేజ్ అయ్యింది. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేసినప్పటి కీ ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసుపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×