E-Paper
Advertisement

KA Paul On PM Modi: ప్రధానిపై శివాలెత్తిన కేఏ పాల్.. చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్

KA Paul On PM Modi: ప్రధానిపై శివాలెత్తిన కేఏ పాల్.. చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్
Advertisement

KA Paul On PM Modi: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. భారతీయులకు సంకెళ్లు వేసి దేశానికి అమెరికా పంపించడంపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఆగ్రహాంగా ఉంది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్.

ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. రేపిస్టులు, టెర్రరిస్టులు, క్రిమినల్స్ మాదిరిగా భారతీయులను స్వదేశానికి ట్రంప్ సర్కార్ పంపించడంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారాయన. పాలన చేతకాకపోతే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఆ పదవిలో అమిత్‌ షాను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయులు క్రిమినల్సా అంటూ మండిపడ్డారు. తక్షణమే విదేశాంగ మంత్రి జైశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాతో కలిసి తాను పోరాటం చేస్తాన్నారు.

అమెరికాలో బాధితులకు అండగా తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ చీఫ్. అమెరికాలోని పలువురు సేనెటర్లతో మాట్లాడుతున్నానని చెప్పారు. 54 లక్షల మంది భారతీయుల్లో 8 నుంచి 12 లక్షలు వీసా ఓవర్ స్టేలో అక్రమంగా అక్కడ ఉన్నారని గుర్తు చేశారు. నేరస్తులు, టెర్రరిస్టుల మాదిరిగా మెక్సికో బోర్డర్ క్రాస్ చేసి వాళ్లు వెళ్లలేదన్నారు.

Advertisement

ALSO READ:  చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!

బుధవారం అమెరికా నుంచి వచ్చిన విమానంలో దాదాపు 30 మంది గుజరాతీయులు, మిగతావారు పంజాబీలు ఉన్న విషయాన్ని వివరించారు కేఏ పాల్. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలతో ఒదిగేదేమీ లేదన్నారు. అక్కడి ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

అమెరికాలో అక్రమంగా ఉన్నవారికి పిల్లలు పుడితే ఇల్లీగల్ కాదని, లీగల్ అని చెప్పుకొచ్చారు. అమెరికా చట్టాలు ప్రకారం.. అక్కడ ఎవరు పుడితే వారు అక్కడి సిటిజన్ అని అన్నారు. అక్కడి చట్టాన్ని ధిక్కరించి క్యాన్సిల్ చేసే అధికారం ట్రంప్‌కు లేదన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రజలకు ఫాల్స్ వాగ్దానాలు ఆయన చేశారన్నారు.

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×