E-Paper
Advertisement

KA Paul On PM Modi: ప్రధానిపై శివాలెత్తిన కేఏ పాల్.. చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్

KA Paul On PM Modi: ప్రధానిపై శివాలెత్తిన కేఏ పాల్.. చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్

KA Paul On PM Modi: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. భారతీయులకు సంకెళ్లు వేసి దేశానికి అమెరికా పంపించడంపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఆగ్రహాంగా ఉంది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్.

ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. రేపిస్టులు, టెర్రరిస్టులు, క్రిమినల్స్ మాదిరిగా భారతీయులను స్వదేశానికి ట్రంప్ సర్కార్ పంపించడంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారాయన. పాలన చేతకాకపోతే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆ పదవిలో అమిత్‌ షాను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయులు క్రిమినల్సా అంటూ మండిపడ్డారు. తక్షణమే విదేశాంగ మంత్రి జైశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాతో కలిసి తాను పోరాటం చేస్తాన్నారు.

అమెరికాలో బాధితులకు అండగా తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ చీఫ్. అమెరికాలోని పలువురు సేనెటర్లతో మాట్లాడుతున్నానని చెప్పారు. 54 లక్షల మంది భారతీయుల్లో 8 నుంచి 12 లక్షలు వీసా ఓవర్ స్టేలో అక్రమంగా అక్కడ ఉన్నారని గుర్తు చేశారు. నేరస్తులు, టెర్రరిస్టుల మాదిరిగా మెక్సికో బోర్డర్ క్రాస్ చేసి వాళ్లు వెళ్లలేదన్నారు.

ALSO READ:  చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!

బుధవారం అమెరికా నుంచి వచ్చిన విమానంలో దాదాపు 30 మంది గుజరాతీయులు, మిగతావారు పంజాబీలు ఉన్న విషయాన్ని వివరించారు కేఏ పాల్. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలతో ఒదిగేదేమీ లేదన్నారు. అక్కడి ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

అమెరికాలో అక్రమంగా ఉన్నవారికి పిల్లలు పుడితే ఇల్లీగల్ కాదని, లీగల్ అని చెప్పుకొచ్చారు. అమెరికా చట్టాలు ప్రకారం.. అక్కడ ఎవరు పుడితే వారు అక్కడి సిటిజన్ అని అన్నారు. అక్కడి చట్టాన్ని ధిక్కరించి క్యాన్సిల్ చేసే అధికారం ట్రంప్‌కు లేదన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రజలకు ఫాల్స్ వాగ్దానాలు ఆయన చేశారన్నారు.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×