E-Paper
Advertisement

Kapu Leader: పవన్ కళ్యాణ్‌కు మరోసారి హరిరామజోగయ్య లేఖ.. ఈ సారి ఏమన్నారు?

Kapu Leader: పవన్ కళ్యాణ్‌కు మరోసారి హరిరామజోగయ్య లేఖ.. ఈ సారి ఏమన్నారు?
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాపు నేతలైన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌కు లేఖాస్త్రాలు సంధించారు. తొలుత ఆయనకు మద్దతుగా ఉండి.. ఆ తర్వాత విమర్శలు చేశారు. ముఖ్యంగా టీడీపీ కూటమిలో సీట్ల కేటాయింపు సందర్భంలో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. జనసేన పార్టీకి తక్కువ సీట్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు. చివరికి వీరి లేఖాస్త్రాలతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కూడా. కొందరైతే వీరిని జనసేన వ్యతిరేకులని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు.

కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ రాశారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

Advertisement

కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు 99 శాతం ఓట్లేసి గెలిపించారని చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని 99 శాతం మంది కాపులు కూటమికి మద్దతు పలికారని వివరించారు. ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపేశారు.

Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్

Advertisement

ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన హైకోర్టులో గతంలో పిటిషన్ వేసిందని, అందుకు విముఖత తెలుపుతూ కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిందని హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలగా స్పందిస్తుంది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు తమ సమాజానికి ప్రయోజనం కలిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×