E-Paper
Advertisement

Kesineni Nani: టీడీపీకి కేశినేని నాని గుడ్‌ బై.. వేడెక్కిన విజయవాడ

Kesineni Nani: టీడీపీకి కేశినేని నాని గుడ్‌ బై.. వేడెక్కిన విజయవాడ
Advertisement

Kesineni Nani: అలకలు.. బుజ్జగింపులు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రగిలిన బెజవాడ రాజకీయాన్ని కేశినేని నాని తెల్లవారు జామున మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్‌లో ప్రకటించారు. తన అవసరం పార్టీకి లేదని చంద్రబాబాబు భావించినపుడు పార్టీలో కొనసాగడం సరికాదని ఆయన ట్వీట్ చేశారు. అందుకే.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేసి.. తర్వాత పార్టీకి కూడా గుడ్ బై చెబుతానని అన్నారు. దీంతో చలికాలం తెల్లవారుజామున కూడా బెజవాడ వేడెక్కింది.

రెండు రోజులుగా విజయవాడ టీడీపీ పాలిటిక్స్ ఏపీలో హెడ్ లైన్స్‌గా మారాయి. కేశినేని బ్రదర్స్ మధ్య వార్‌ తారాస్థాయికి చేరింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు వస్తున్నాయని కేశినేని నాని చేసిన పోస్టుతో టీడీపీలో చర్చకు దారి తీసింది. ఓ వైపు చంద్రబాబుపై గురు భక్తి ప్రదర్శిస్తూనే.. పార్టీలో కొందరి నేతల తీరును కేశినేని నాని విమర్శించారు. కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ కన్ఫామ్ చేశారని జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో.. నాని అసంతృప్తి వెల్లగక్కారు. దీంతో.. టీడీపీ నుంచి బుజ్జగింపు నేతలు కూడా రంగంలోకి దిగారని చర్చ జరిగింది. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని కేశినేని నాని ప్రకటించారు. అటు.. బెజవాడ టీడీపీ రాజకీయంలో వైసీపీ కూడా ఎంటర్ అయింది. నానిని పొమ్మనలేక పొగపెడుతున్నారని ట్వీట్ చేసింది. ఇలా.. అలకలు, బుజ్జగింపు, సవాళ్ల పర్వం తర్వాత.. పార్టీకి గుడ్ బై చెబుతానని నాని ప్రకటించారు.

Advertisement

.

.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×