BigTV English

Kidney Racket In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..

Kidney Racket  In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..

Kidney Racket In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. బాధితురాలి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరుకు చెందిన బూసి అనురాధ…..కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. దాదాపు 5 నుంచి 7 లక్షలు వరకు ఇస్తామంటూ కిడ్నీ ముఠా….ఆమెకు మాయమాటలు చెప్పింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆమె…..అంత డబ్బు అనేసరికి ముఠా వలలో పడింది.


ఒక కిడ్నీకి 7 లక్షలు ఇస్తామన్న ముఠా.. సర్జరీ తర్వాత 4 లక్షలే ఇచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరగ్గా….మిగతా డబ్బుకోసం బాధితురాలు ఎదురుచూసింది. చివరకు ఆ డబ్బుతో బ్రోకర్‌ ప్రసాద్‌ పారిపోయాడు. మోసపోయాయని గ్రహించి చేసేదేమీ లేక…. అనురాధ ఏలూరు వన్‌టాన్‌ పోలీసులను ఆశ్రయించింది.

పేదలకు డబ్బు ఆశచూపి కిడ్నీలు కాజేసే ముఠాలు ఏపీ అంతట చెలరేగిపోతున్నాయి. గతంలో విశాఖలోనూ ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది. పెందుర్తిలో వినయ్‌ అనే యువకుడి కిడ్నీ కాజేశారు. ఒక కిడ్నీ అమ్మితే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్‌ అయ్యాక 2 లక్షలు చేతిలో పెట్టి ఉడాయించారు.


ఏపీలో కిడ్నీ రాకెట్‌ దందా యథేచ్చగా సాగుతోంది. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు గానీ, పోలీసులు గానీ సరైన యాక్షన్‌ తీసుకోవడం లేదన్నది…..తాజా ఘటనే అర్థమవుతోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామనే పేదల ఆశనే….ఈ ముఠాలను క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే ఇంకా చాలా మంది పేదలు…..కిడ్నీ రాకెట్‌ ముఠాకు బలికావల్సిందే.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×