BigTV English

Nara Lokesh: ఒక్క ట్వీట్ తో.. ప్రాణం దక్కింది.. ఆమె ఇంటికి చేరింది!

Nara Lokesh: ఒక్క ట్వీట్ తో.. ప్రాణం దక్కింది.. ఆమె ఇంటికి చేరింది!

Nara Lokesh: దేశం కాని దేశమది. చేతిలో పాస్ పోర్ట్ లేదు. బిక్కు బిక్కుమంటూ కన్నీళ్లు కారుస్తోంది ఆ మహిళ. మరోవైపు యజమాని ఇబ్బందులకు తాళలేక రోదిస్తోంది ఆమె. ఎవరో వస్తారని, తనను ఆదుకుంటారని ఆ మహిళ రోదించని రోజు లేదు. అయితే ఎలాగోలా తన సమస్యను కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు వెంటనే మంత్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..


పొట్టకూటి కోసం గల్ఫ్ కు వెళ్లిన ఆ మహిళ, రక్షించాలంటూ కన్నీరు మున్నీరైంది. ఎలాగైనా తనను కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని వేడుకుంది. ఈ మహిళ ఆవేదన అర్థం చేసుకున్న మంత్రి నారా లోకేష్ స్పందించి, ఆ మహిళను సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన పద్మ బ్రతుకు దెరువు కోసం మస్కట్ కు వెళ్ళింది. మస్కట్ కు వెళ్లిన కొద్ది రోజులకే, తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది.

కుటుంబ భారాన్ని మోసేందుకు తప్పక మస్కట్ వెళ్లిన ఆమెను కష్టాలు వెంటాడాయి. అక్కడి యజమాని ఇబ్బందులు రోజురోజుకు అధికమయ్యాయి. కానీ తన కుటుంబం కోసం వాటిని ఓర్చుకొని అలాగే జీవితం సాగించేది. యజమాని ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో, దేశం కాని దేశంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. నిద్రాహారాలు లేకుండా కన్నీటి పర్యంతమయ్యేది పద్మ. ఎలాగైనా కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని అనుకుంది. అయితే తనకు ఎవరూ తెలియదు. ఏమి చేయాలో పాలుపోలేదు. తన ఇంటికి మాత్రం ఫోన్ చేసి, తన ఇబ్బందులు చెప్పింది.


వెంటనే కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ కు తన ఇబ్బందులను వివరిస్తూ, ఆమె ఓ వీడియో విడుదల చేసింది. తాను మస్కట్ కు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, తనను ఎలాగైనా రక్షించాలని ఆమె వేడుకొంది. ఆమె వీడియోను కుటుంబసభ్యులు లోకేష్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి లోకేష్ వెంటనే స్పందించి, తన టీంని అలర్ట్ చేశారు. వేరే దేశానికి వెళ్లిన మహిళ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న లోకేష్ టీమ్ కూడా, హుటాహుటిన ఆమెకు ఆపన్నహస్తం అందించారు. పద్మను క్షేమంగా ఇంటికి తిరిగివచ్చేలా చర్యలు తీసుకున్నారు.

Also Read: Manmohan Singh Funeral : మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోడీ, షా.. అంతక్రియలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

ఇంటికి చేరిన పద్మ, కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమైంది. తాను ప్రాణాల మీద ఆశ వదులుకున్న సమయంలో, మంత్రి నారా లోకేష్ స్పందించి రక్షించారని పద్మ తెలిపారు. సకాలంలో స్పందించి తనను ఇంటికి తిరిగి వచ్చేలా చేసిన మంత్రి లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏదిఏమైనా ఒక్క ట్వీట్ ఆమె ప్రాణాలు కాపాడిందని చెప్పవచ్చు.

Related News

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Big Stories

×