BigTV English
Advertisement

Kurnool Gold Mines : రాయలసీమ ఇక రతనాల సీమ.. ఆస్పరిలో బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్ఐ..

Kurnool Gold Mines : రాయలసీమ ఇక రతనాల సీమ.. ఆస్పరిలో బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్ఐ..

Kurnool Gold Mines : రాయలసీమకు ఇక పూర్వవైభవం రానుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలున్నాయని జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. ప్రస్తుతం గనుల నాణ్యత, విస్తీర్ణం అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన జీఎస్ఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు జీఎస్ఐ బృందాన్ని కోరారు.


త్వరలో మరో మారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతుంటే.. పగిడిరాయిలో గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో అస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ మైన్స్‌తోనైనా తమ జీవితాలు మారతాయంటున్నారు ఆస్పరి గ్రామస్థులు.

తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత, 2005లోనే జియో మోసూర్‌ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి.


బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆసంస్థ, మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈసంస్థ ఇప్పటికే 100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×