E-Paper
Advertisement

Kurnool Gold Mines : రాయలసీమ ఇక రతనాల సీమ.. ఆస్పరిలో బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్ఐ..

Kurnool Gold Mines : రాయలసీమ ఇక రతనాల సీమ.. ఆస్పరిలో బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్ఐ..

Kurnool Gold Mines : రాయలసీమకు ఇక పూర్వవైభవం రానుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలున్నాయని జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. ప్రస్తుతం గనుల నాణ్యత, విస్తీర్ణం అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన జీఎస్ఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు జీఎస్ఐ బృందాన్ని కోరారు.

త్వరలో మరో మారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతుంటే.. పగిడిరాయిలో గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో అస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ మైన్స్‌తోనైనా తమ జీవితాలు మారతాయంటున్నారు ఆస్పరి గ్రామస్థులు.

తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత, 2005లోనే జియో మోసూర్‌ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి.

బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆసంస్థ, మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈసంస్థ ఇప్పటికే 100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×