E-Paper
Advertisement

Women Cheated Man: ఫోటోలో చెల్లి.. చాటింగ్ లో అక్క.. ఏళ్లకు ఏళ్లు సాగిన ప్రేమ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే!

Women Cheated Man: ఫోటోలో చెల్లి.. చాటింగ్ లో అక్క.. ఏళ్లకు ఏళ్లు సాగిన ప్రేమ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే!
Advertisement

Women Cheated Man: చెల్లెలు ఫోటోతో ఓ అబ్బాయికి పరిచయమైంది ఆ యువతి. అది కూడా సోషల్ మీడియా ద్వారా మాటలు కలిపి, ఏకంగా ఒక కోటి 20 లక్షలు మోసం చేసిందట. చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, వైద్యశాలలో చికిత్స పొందుతోంది ఆ యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన ఓ యువతి, తెలంగాణ పటాన్ చెరువు మండలం ముత్తంగి కి చెందిన యువకుడికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. యువకుడు హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరి పరిచయం ఏళ్ల తరబడి కొనసాగింది.

Advertisement

అయితే సదరు యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, పెళ్లి మాట ఎత్తగానే యువతి ఏదో ఒక కారణం చెబుతూ దాటవేసేదట. పలుమార్లు ఆర్థికంగా సహాయపడేందుకు డబ్బులు అందజేసిన యువకుడు, మొత్తం కోటి 20 లక్షలు అందజేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

చివరకు తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పెద్దల సమక్షంలో పంచాయతీ చేయగా, రూ.10 లక్షలు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన డబ్బులను యువకుడు పదేపదే అడుగుతుండగా, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో పత్తికొండ పోలీసులను యువకుడు ఆశ్రయించాడు.

Advertisement

Also Read: Game Changer Pre Release Event : కల నెరవేరబోతుంది… డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ఒకే స్టేజ్‌పైకి బాబాయ్ – అబ్బాయ్?

ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. చెల్లెలు ఫోటో సోషల్ మీడియా ముఖచిత్రంగా ఏర్పాటు చేసుకొని తనను సదరు యువతి మోసగించిందని, ఆర్థికంగా డబ్బు సహాయం అడిగిన సమయంలో తాను కోటి 20 లక్షల వరకు అందించినట్లు తెలిపాడు. అయితే పదేపదే డబ్బులు అడిగిన సందర్భంలో యువతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఏకంగా మత్తు గులిగలు మింగి అన్నంత పని చేసింది. దీనితో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఓ వైపు తనకు న్యాయం చేయాలని యువకుడు, మరోవైపు ప్రాణాప్రాయ స్థితిలో ఆ యువతి ఉండగా, పెద్దలు మరోమారు ఈ విషయంలో జోక్యం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×