E-Paper
Advertisement

Tirumala Chirutha Attack: తిరుపతిలో ద్విచక్ర వాహన దారుడిపై చిరుత దాడి.. భయం గుప్పిట్లో భక్తులు

Tirumala Chirutha Attack: తిరుపతిలో ద్విచక్ర వాహన దారుడిపై చిరుత దాడి.. భయం గుప్పిట్లో భక్తులు
Advertisement

Tirumala Chirutha Attack: తిరుపతి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అలిపిరి జూ పార్క్ రోడ్డులో జరిగిన ఒక ఘటనలో, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనను వెనుక వస్తున్న కారులోని ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేశారు, దీంతో ఈ విడీయో వైరల్‌గా మారింది.

చిరుత సంచారం.. భయాందోళనలను భక్తులు
అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో, అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో కూడా చిరుత సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. ఈ ప్రాంతంలో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయని, ముఖ్యంగా జూ పార్క్ రోడ్డు, కల్వర్టుల సమీపంలో రాత్రి సమయాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలు భక్తులు, స్థానికులలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ రోడ్డుపై ప్రయాణించే వారిలో ఆందోళన పెరిగింది.

Advertisement

ప్రయాణికులకు అధికారులు హెచ్చరిక..
అలాగే ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపి ప్రయాణికులు సమయం గడపడం సర్వసాధారణం. కానీ, ఇలా చేస్తే ఈ చిరుత సంచారం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా తిరుమల, అలిపిరి ప్రాంతాల్లో చిరుతలు కనిపించిన సంఘటనలు నమోదయ్యాయి.. అంతేకాకుండా ఒక ఘటనలో ఆరేళ్ల చిన్నారి కూడా మృతిచెందింది.

Also Read: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు..

Advertisement

ఒంటరిగా వెళ్లకూడదంటోన్న అధికారులు..
టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, చిరుతల కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ, ఇనుప కంచెలను దాటుకుని చిరుతలు రోడ్లపైకి రావడం కొనసాగుతోంది. భక్తులు గుండెల్లో దడ పుట్టించే ఈ ఘటనల నేపథ్యంలో, రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించకుండా, గుంపులుగా రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×